Big breaking: ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (50) కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఆయనకు ఈ ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
ఆయన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుండి 2019 ఎన్నికల్లో గెలిచే గెలుపొందారు. మంత్రి గౌతమ్ రెడ్డి మృతి వార్తతో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఇతర వైసిపి నాయకులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. మంత్రి మేకపాటి ఇటీవలే రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు దుబాయ్ వెళ్లి వచ్చారు.