Big Breaking: ఏపి సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ విచారణ తీర్పుపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఎంపి రఘురామ కృష్ణ రాజు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ బెయిల్ రద్దు కేసులో రేపటి తీర్పుపై తనకు నమ్మకం లేదని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. జగన్ మీడియా తప్పుడు ప్రచారం వల్ల తీవ్ర ప్రభావం అయ్యే అవకాశం ఉందని అనుమానాన్ని రఘురామ వ్యక్తం చేశారు. నిష్పాక్షమైన తీర్పు కోసం కేసును మరో బెంచ్ కు మార్చాలని రఘురామ కోరారు. రఘురామ లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.
జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రేపు (15వ తేదీ) సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించనున్నది. ఈ తరుణంలో రఘురామ తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.