AP BJP: ఏపీలో బీజేపీ నాయకులు చేసే వ్యాఖ్యలు వారి వ్యక్తిగతంగా చూడాలని బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి పొత్తులపై చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఆదివారం బీజేపీ కార్యాలయంలో దినకర్ మీడియాతో మాట్లాడారు.
ఏపీలో పొత్తులు, సీట్లపై కేంద్ర పెద్దలు నిర్ణయం తీసుకుంటారని దినకర్ చెప్పారు. విష్ణువర్థన్ రెడ్డి మాటలకు రాష్ట్ర పార్టీకి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయాలను ప్రకటించడం కరెక్టు కాదని ఆయన అన్నారు. కేంద్ర పెద్దలు తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర నాయకులు అమలు చేస్తారని అన్నారు. ఎవరైనా ఏదైనా పొత్తులపై మాట్లాడితే అది వారి వ్యక్తిగతమని భావించాలని తెలిపారు. ఏపీలో పరిణామాలను కేంద్ర పెద్దలకు వివరించామని చెప్పారు. పార్టీ పెద్దల ఆదేశాలు ఉంటే పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి త్వరలో ప్రకటిస్తారని లంకా దినకర్ వెల్లడించారు.
75 అసెంబ్లీ, 12 పార్లమెంట్ స్థానాలు కేటాయిస్తేనే బీజేపీ పొత్తు పెట్టుకుంది అన్నట్లుగా విష్ణువర్థన్ రెడ్డి కామెంట్స్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. దీనిపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ పార్టీ తరపున దినకర్ స్పందించారు.
PM Modi: దేశ ప్రజలకు ప్రధాని మోడీ కీలక సూచన .. ఆ రోజు అందరూ ఆ పని చేయండి