రాజకీయాల్లో ఇదొక చిత్రమైన వ్యవహారం. ప్రత్యర్థులను ఓడించాలనే కసితో ఉన్న టీడీపీ అధినేత చం ద్రబాబు చేస్తున్న చిన్న చిన్న మిస్టేక్లు.. అదే ప్రత్యర్థులకు వరాలుగా మారుతున్నాయి. అదే ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గంలో జరుగుతోంది. తాజాగా చంద్రబాబు చేసి న వ్యాఖ్యలతో ఇక్కడ వైసీపీ అభ్యర్తిగా పోటీ చేస్తున్న రామాంజనేయులు గ్రాఫ్ అమాంతంగా పెరిగిపో యింది. నమ్మడం కొంత కష్టమే అయినా.. క్షేత్రస్థాయిలో వాస్తవం ఇదే.
శింగనమల నియోజకవర్గంలో 2019లో జొన్నలగడ్డ పద్మావతి వైసీపీ తరఫున పోటీ చేసి విజయం అందు కున్నారు. ఐదేళ్లు ఆమె బాగానే కష్టపడ్డారు. ఆమె భర్త కూడా సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడు కూ డా. కరోనా సమయంలో మిగిలిన ఎమ్మెల్యేల మాట ఎలా ఉన్నా.. పద్మావతి మాత్రం ఇంటింటికీ తిరిగా రు. మాస్కులు, మందులు, ఆహారం కూడా పంచారు. దీంతో సింపతీ కూడా ఉంది. అయినప్పటికీ.. జగన్ ఆమెకు టికెట్ ఇవ్వలేదు. ఇదే విషయాన్ని .. తాజాగా చంద్రబాబు ప్రస్తావించారు.
వైసీపీ నాయకురాలు, టికెట్ రాని పద్మావతిని చంద్రబాబు ఆకాశానికి ఎత్తేశారు. ఆమెకు టికెట్ ఇవ్వలేద ని , కష్టపడిన వారికి వైసీపీలో అవకాశం లేకుండా పోయిందని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో వైసీపీ ఇక్కడ అబ్యర్థిగా ప్రకటించిన రామాంజనేయులు గురించి సటైర్లు సంధించారు చంద్రబాబు. ఆయన ట్రక్కు డ్రైవర్ అని.. అలాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తులకా టికెట్ ఇచ్చేది అని చంద్రబాబు వ్యంగ్యాస్థ్రాలు సంధించారు.
అయితే.. వాస్తవానికి చంద్రబాబు రామాంజనేయులు పేరును ప్రస్తావించే వరకు , ఆయన ట్రక్కు డ్రైవర్ అని చెప్పేవరకు.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎలాంటి వారికి టికెట్లు ఇచ్చిందనే విషయం ఎవరికీ తెలియదు. కానీ, ఇప్పుడు తెలిసిన తర్వాత.. జగన్ సామాన్యులకు, డ్రైవర్లకు కూడా టికెట్లు ఇస్తున్నారనే పాజిటివ్ టాక్ వచ్చింది. ఇది శింగనమలలో అయితే.. మరింత పెరిగింది. ఇక, చంద్రబాబు వ్యాఖ్యలకు వెంటనే జగన్ భారీ కౌంటర్ ఇచ్చారు.
`ఔను చంద్రబాబు.. మొదటి నుంచి మేం చెబుతూనే ఉన్నాం. మాదిపేదలపార్టీ. మేం పేదల పక్షం. మీది పెత్తందారుల పార్టీ. పెత్తందారుల పక్షం. రామాంజనేయులు.. చేసే పని డ్రైవరే అయినా.. ఆయనను కడుపులో పెట్టుకున్నాం. డ్రైవర్లు.. క్లీనర్లు వంటి అట్టడుగు వర్గాలకు కూడా టికెట్ ఇచ్చే పార్టీ వైసీపీ. రామామాంజనేయులు ఎమ్మెల్యే చేశాడు. బీఈడీ కూడా చేశారు. కానీ, నీ హయాంలో ఉద్యోగాలు రాక.. ఆయన ట్రక్కు డ్రైవర్గా చేశారు. కానీ, ఇదే వైసీపీ ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. రేపు ఎమ్మెల్యే కూడా అవుతున్నారు. ఇదీ.. నీకు-వైసీపీకి ఉన్న తేడా` అని జగన్ అన్నారు.
దీంతో రామాంజనే యులు గ్రాఫ్ ఆకాశానికి చేరిపోయింది. లారీ ఓనర్స్ అసోసియేషన్ల నుంచి కార్మిక వర్గాల వరకు ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా తీర్మానాలు చేసే పరిస్థితి వచ్చింది. మొత్తంగా చంద్రబాబు కెలికి మరీ.. రామాంజనేయులును గెలిపిస్తున్నారని అంటున్నారు.