కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతా విశ్వనాథ్. ప్రస్తుతం పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ నుంచే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బరిలోకి దిగుతున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు.. దేశ విదేశాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. జూన్ 4వ తేదీ కోసం వేచి చూసేలా చేసింది. ఒకవైపు సీనియర్ నాయకురాలు.. మరోవైపు పవర్ స్టార్.. లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న జనసేన అధినేత. దీంతో ఈ ఫైట్ అందరికీ ఆసక్తిగా మారింది.
కట్ చేస్తే.. అసలు ఎంపీగా ఉన్న గీత ఈ సీటును కోరుకున్నారా? అనేది చర్చ. తాజాగా ఈ విషయంపై తాడేపల్లి వర్గాలు అసలు విషయాన్ని లీక్ చేశాయి. ఎన్నికలకు ఆరు మాసాల ముందే.. పవన్ పిఠాపురం నుంచి పోటీ చేయనున్నారని.. వైసీపీ సర్వే సంస్థ ఐప్యాక్ అంచనా వేసింది. దీనిని సీఎం జగన్ముందు పెట్టింది. దీంతో ఆయన రెండో మాటలేకుండా.. ఈ సీటును వంగా గీతకు ఇవ్వాలని నిర్ణయించారు. నిజానికి ఇక్కడ నుంచి మరో ఇద్దరు నాయకులు కూడా రెడీ అయ్యారు.
కానీ, వారికి ఎవరికీ కూడా జగన్ టికెట్ ఇవ్వలేదు. గీతను ఎంపిక చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కూడా పక్కన పెట్టారు. అయితే.. ఈ సమయంలో గీత పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు ముందుకు రాలేద న్నది తాజాగా తెలిసిన విషయం. తనకు మరోసారి పార్లమెంటుకే వెళ్లాలని ఉందని.. లేక పోతే.. కాకినాడ రూరల్ ఇవ్వాలని ఆమె పట్టుబట్టారు. కానీ, జగన్ మాత్రం ఆమె ప్రతిపాదనను పక్కన పెట్టారు. పిఠాపురం వెళ్లితీరాల్సిందే.. అని పట్టుబట్టారు.
ఆ వెంటనే ఫ్యూచర్పై గీత సందేహాలు వ్యక్తం చేశారు. ఇక్కడ పవన్ గెలుస్తారని కాదుకానీ.. తాను ఓడితే పరిస్తితి ఏంటిని జగన్ముందు ఆమె సందేహం వ్యక్తం చేశారు. దీనికి జగన్ మంచి ఆఫరే ఇచ్చారనేది పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఓడిపోతే.. ఆవెంటనే.. రాజ్యసభ లేదా.. మండలి నుంచి తీసుకుని.. మంత్రి పదవి ఇస్తామని ఆయన హామీ ఇచ్చినట్టు తెలిసింది. అంతేకాదు.. పిఠాపురంలో గెలిస్తే.. ఖచ్చితంగా మంత్రి పదవిని ఇస్తామని జగన్ గట్టి హామీ ఇచ్చినట్టు తాడే పల్లి వర్గాలుచెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గీత ఇక్కడ పోటీకి ఒప్పుకొన్నారని చెబుతున్నారు. ఇదీ.. సంగతి! అంతేకాదు.. ఈ విషయం తేల్చేందుకు గీత రెండు రోజులు విజయవాడలోనే మకాం వేశారని కూడా అంటున్నారు.