Cyclone: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతున్న నేపథ్యంలో కోస్తాంధ, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడులోని నాగపట్నం నుండి 320 కిలో మీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. తీవ్ర వాయుగుండం గడచిన ఆరు గంటలుగా 13 కి.మీ వేగంతో ఉత్తర దిశగా కదులుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది సాయంత్రానికి తమిళనాడు తీరానికి మరింత దగ్గరగా వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
Cyclone: దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో
తీవ్ర వాయుగుండం ప్రభావం కారణంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. తమిళనాడులో భారీ గా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తమిళనాడు, కోస్తాంధ్ర లో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో రెవెన్యూ అధికారుుల తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.