IPS AB Venkateswara Rao: ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ల తర్వాత తిరిగి బాధ్యతలు స్వీకరించానని చెప్పారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ పట్ల పూర్తి అవగాహన తనకు లేదన్నారు. ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ కు గతంలో ఘనకీర్తి ఉండేదనీ, ఉమ్మడి రాష్ట్రంలో ప్రింటింగ్ విభాగం ఆదరణ పొందతూ వచ్చిందని గుర్తు చేశారు. గతంలో ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు ఇక్కడే ప్రింటింగ్ అయ్యేవన్నారు. ప్రస్తుత కార్యకలాపాలపై సిబ్బందితో చర్చించి అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
IPS AB Venkateswara Rao: ప్రాధాన్యత లేని పోస్టింగ్ గా భావించడం లేదు
సాధారణంగా సీనియర్ ఐపీఎస్ అధికారులు దీనిని లూప్ లైన్ పోస్టు గా భావిస్తుంటారు. కానీ ఏబీ వెంకటేశ్వరరావు మాత్రం ఇది ప్రాధాన్యత లేని పోస్టింగ్ గా భావించడం లేదని పేర్కొన్నారు. నియామకాల విషయం ప్రభుత్వం తన ఆలోచనల మేరకు చేస్తుందని చెప్పారు. కార్యాలయానికి వచ్చిన ఆయనకు ముందుగా ఉద్యోగులు సాదర స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయం మొత్తాన్ని పరిశీలించారు. అయితే తనకు ప్రత్యేకంగా ఛాంబర్ లేకపోవడంతో డిప్యూటి జనరల్ మేనేజర్ రూమ్ లోనే ఏబీ వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు.
న్యాయ పోరాటం చేసి
ఏబి వెంకటేశ్వరరావు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించారు. అయితే ఆ సమయంలో ఆయన అక్రమాలకు పాల్పడ్డారన్న అబియోగాలపై జగన్ సర్కార్ ఆయనను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తన సస్పెన్షన్ కు వ్యతిరేకంగా ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వంపై న్యాయపోరాటం చేసి విజయం సాధించారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆయన సస్పెన్షన్ ను ఎత్తివేసింది. అయితే సస్పెన్షన్ ఎత్తివేసిన తరువాత కూడా కొద్ది రోజులు ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ క్రమంలో పలు మార్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రాలు పంపిన నేపథ్యంలో తాజాగా ప్రింటింగ్ స్టెషనరీ కమిషనర్ గా నియమిస్తూ పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వడంతో నేడు విధుల్లోకి జాయిన్ అయ్యారు.