Jagananna Thodu: చిరు వ్యాపారులకు పదివేల వంతున వడ్డీ లేని రుణాలు అందించే పథకం జగనన్న తోడు. ఏపి సీఎం వైఎస్ జగన్ నేడు లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ బటన్ నొక్కడం ద్వారా లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. నిరుపేదలైన చిరు వ్యాపారులకు ప్రతి ఏటా ఒకొక్కరికి పది వేల రూపాయల వంతున వడ్డీలేని రుణాన్ని ప్రభుత్వం అందిస్తోంది. గత మంగళవారమే ఈ పథకం కింద లబ్దిదారులకు నిధులు విడుదల చేయాల్సి ఉండగా, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నేటికి వాయిదా వేసింది.
Read More: CM YS Jagan: డీసీసీబీలకు సీఎం జగన్ కీలక ఆదేశాలు.. ప్రజలకు గుడ్ న్యూస్..
Jagananna Thodu: 5.10లక్షల మందికి లబ్ది
ఈ పథకం కింద ప్రభుత్వం రూ.510 కోట్ల నిధులను కేటాయించింది. 5 లక్షల 10వేల 462 మంది ఈ పథకం ద్వారా లబ్దిపొందుతున్నారు.అలాగే 16.16 కోట్ల రూపాయలను వడ్డీ రీయింబర్స్ మెంట్ కింద ప్రభుత్వం చెల్లించనున్నది.
Jagananna Thodu: చిరు వ్యాపారులను ఆదుకునేందుకు
వైఎస్ జగన్మోహనరెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత వివిధ వర్గాల అభ్యున్నతికి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రోజు వారీ పెట్టుబడుల కోసం అధిక వడ్డీకి ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి నష్టపోతున్న చిరు వ్యాపారులను ఆదుకునేందుకు సీఎం జగన్ ఈ పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకం పట్ల చిరు వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది గంటల్లో లబ్దిదారుల ఖాతాల్లో పది వేల వంతున జమ కానున్నాయి.