Machilipatnam(Krishna): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యత అని కృష్ణాజిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. మానవ మనుగడ చెట్లపై ఆధారపడి ఉందన్నారు. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కేవీ రామకృష్ణ, పలు న్యాయస్థానాలకు చెందిన న్యాయమూర్తులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
Breaking: కృష్ణానదిలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి