NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

Petrol Diesel prices: పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపులో కేంద్రం వంతు అయిపోయింది .. ఇక రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలంటూ బీజేపీ నేతల డిమాండ్

Petrol Diesel prices: పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు ఒక సారి ఇప్పుడు తాజాగా మరో సారి ఎక్సైజ్ సుంకం తగ్గించింది. పెట్రోల్ లీటరు ధర రూ.120లు, డీజిల్ లీటరు ధర రూ.105లు పైగా చేరిన సంగతి తెలిసిందే. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలపైనా పడింది. ధరల పెరుగుదలతో వాహనదారులు, పేద మద్యతరగతి వర్గాలు ఇబ్బందులు పడుతున్నారు.

Petrol Diesel prices: Bjp leaders demand Decrease VAT
Petrol Diesel prices Bjp leaders demand Decrease VAT

Petrol Diesel prices: తెలుగు రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలి

ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై రూ.8లు, డీజిల్ పై రూ.6లు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో లీటర్ పెట్రోల్ ధర రూ.9.50ల మేర తగ్గనుండగా, లీటర్ డీజిల్ ధర రూ.7ల మేర తగ్గుతోంది. ఇంతకు ముందు కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గించిన సమయంలో బీజేపీ పాలిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ ను తగ్గించాయి. అయితే ఇటు తెలుగు రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించలేదు. ఇప్పుడు మరో సారి కేంద్రం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో తెలుగు రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఆరు నెలల్లో రెండు సార్లు ఎక్సైజ్  సుంకం తగ్గింపు

ఆరు నెలల్లో రెండు పర్యాయాలు పెట్రోల్, డీజిల్ పై కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించడంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్శింహరావు స్పందిస్తూ ప్రధాన మంత్రి మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం వ్యాట్ ను విపరీతంగా పెంచడంతో ఏపిలో పెట్రోల్, డీజిల్ ధఱలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని జీవీఎల్ ఆరోపించారు. ప్రజలకు ఉపశమనం కల్గించడానికి ఏపి సీఎం వైఎస్ జగన్ కూడా కేంద్రం తరహాలోనే భారీగా వ్యాట్ ను తగ్గించాలని డిమాండ్ చేశారు జీవీఎల్. లేకపోతే బీజేపీ ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళుతుందని జీవీఎల్ హెచ్చరించారు.

Petrol Diesel prices: భారీగా ఆదాయం తగ్గుతున్నా

మరో పక్క తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఇదే విధంగా సీఎం కేసిఆర్ కు సూచన చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేసిన బండి సంజయ్.. ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా సాగుతున్న బీజేపీ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల మేర ఆదాయం తగ్గుతుందని తెలిసినా ఎక్సైజ్ సుంకం తగ్గించిందని అన్నారు. కేంద్రం మాదిరిగానే కేసిఆర్ సర్కార్ కూడా వ్యాట్ ను తగ్గించి ప్రజలకు మరింత ఉపశమనం కల్పించేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు బండి సంజయ్, లేని పక్షంలో కేసిఆర్ సర్కార్ ప్రజాగ్రహాన్ని చవిచూస్తుందని బండి సంజయ్ హెచ్చరించారు. బీజేపీ నేతల డిమాండ్ తో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju