Petrol Diesel prices: పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు ఒక సారి ఇప్పుడు తాజాగా మరో సారి ఎక్సైజ్ సుంకం తగ్గించింది. పెట్రోల్ లీటరు ధర రూ.120లు, డీజిల్ లీటరు ధర రూ.105లు పైగా చేరిన సంగతి తెలిసిందే. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలపైనా పడింది. ధరల పెరుగుదలతో వాహనదారులు, పేద మద్యతరగతి వర్గాలు ఇబ్బందులు పడుతున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Petrol Diesel prices: తెలుగు రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలి
ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై రూ.8లు, డీజిల్ పై రూ.6లు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో లీటర్ పెట్రోల్ ధర రూ.9.50ల మేర తగ్గనుండగా, లీటర్ డీజిల్ ధర రూ.7ల మేర తగ్గుతోంది. ఇంతకు ముందు కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గించిన సమయంలో బీజేపీ పాలిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ ను తగ్గించాయి. అయితే ఇటు తెలుగు రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించలేదు. ఇప్పుడు మరో సారి కేంద్రం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో తెలుగు రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఆరు నెలల్లో రెండు సార్లు ఎక్సైజ్ సుంకం తగ్గింపు
ఆరు నెలల్లో రెండు పర్యాయాలు పెట్రోల్, డీజిల్ పై కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించడంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్శింహరావు స్పందిస్తూ ప్రధాన మంత్రి మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం వ్యాట్ ను విపరీతంగా పెంచడంతో ఏపిలో పెట్రోల్, డీజిల్ ధఱలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని జీవీఎల్ ఆరోపించారు. ప్రజలకు ఉపశమనం కల్గించడానికి ఏపి సీఎం వైఎస్ జగన్ కూడా కేంద్రం తరహాలోనే భారీగా వ్యాట్ ను తగ్గించాలని డిమాండ్ చేశారు జీవీఎల్. లేకపోతే బీజేపీ ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళుతుందని జీవీఎల్ హెచ్చరించారు.
Petrol Diesel prices: భారీగా ఆదాయం తగ్గుతున్నా
మరో పక్క తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఇదే విధంగా సీఎం కేసిఆర్ కు సూచన చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేసిన బండి సంజయ్.. ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా సాగుతున్న బీజేపీ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల మేర ఆదాయం తగ్గుతుందని తెలిసినా ఎక్సైజ్ సుంకం తగ్గించిందని అన్నారు. కేంద్రం మాదిరిగానే కేసిఆర్ సర్కార్ కూడా వ్యాట్ ను తగ్గించి ప్రజలకు మరింత ఉపశమనం కల్పించేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు బండి సంజయ్, లేని పక్షంలో కేసిఆర్ సర్కార్ ప్రజాగ్రహాన్ని చవిచూస్తుందని బండి సంజయ్ హెచ్చరించారు. బీజేపీ నేతల డిమాండ్ తో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.