NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

PM Modi Bhimavaram Tour: భీమవరంలో అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ .. టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నకు అవమానం

PM Modi Bhimavaram Tour: విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు 125 జయంతోత్సవ వేడుకల్లో భాగంగా భీమవరం లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కొద్ది సేపటి క్రితం చేరుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సహా సీఎం వైఎస్ జగన్, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ లు గన్నవరం ఎయిర్ పోర్టు నుండి హెలికాఫ్టర్ లో భీమవరంకు చేరుకున్నారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి వేదిక వద్దకు చేరుకున్నారు. అయితే భీమవరం హెలిపాడ్ వద్ద టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకి అవమానం జరిగింది. ప్రధానికి స్వాగతం పలికేందుకు హెలిపాడ్ వద్దకు అచ్చెన్నాయుడు రావడంతో ప్రధానికి స్వాగతం చెప్పే జాబితాలో పేరు లేదని చెప్పడంతో వెనుతిరిగారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తనకు హెలిపాడ్ కు రావాల్సిందిగా కోరారని అచ్చెన్నాయుడు తెలిపారు. జిల్లా కలెక్టర్ కు అందిన జాబితాలో తన పేరు లేదని చెప్పడంతో అచ్చెన్నాయుడు తిరిగి వెళ్లిపోయారు.

PM Modi Bhimavaram Tour Officials insulted atchannaidu
PM Modi Bhimavaram Tour Officials insulted atchannaidu

 

అయితే ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ కి ఇచ్చిన జాబితాలో పేరు ఉన్నప్పటికీ జిల్లా అధికారుల వద్ద జాబితాలో పేరు లేకపోవడం ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తన పేరు లేకపోవడం ఏమిటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి ఆర్కే రోజా తదితర మంత్రులు పాల్గొన్నారు. తొలుత ప్రధాని మోడీకి సీఎం జగన్ జ్ఞాపికను అందజేసి సత్కరించారు. అదే విధంగా విల్లు బాణం బహుకరించారు. కొద్ది సేపటిలో క్షత్రియ సమాజం ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు కుటుంబానికి చెందిన వారసులను సత్కరించారు.

 

ప్రధాని మోడీ, సీఎం వైఎస్ జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు అల్లూరి సీతారామరాజు గొప్పతాన్ని, ఆయన పోరాట పటిమను, త్యాగనిరతిపై ప్రసంగించారు. ఏపి ప్రభుత్వం అల్లూరి సీతారామ రాజు పేరుతో జిల్లాను కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని సీఎం వైఎస్ జగన్ గుర్తు చేస్తూ ఆ జిల్లాలోనూ నేడు అల్లూరి విగ్రహా అవిష్కరణ జరుగుతోందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు భాషలో తన ప్రసంగాన్ని ప్రారంభించి తెలుగు ప్రజలను ఆకట్టుకున్నారు. కాగా గన్నవరం ఎయిర్ పోర్టు రోడ్డులో మోడీ గో బ్యాక్ అంటూ ప్లకార్డు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు సుంకర పద్మశ్రీని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భీమవరంలో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N