Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్. రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్లో సౌర్యకు ఆనందరావు, సౌందర్యలపై అనుమానం వచ్చి నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను సీసీ అనడంతో ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా సాగిందనే చెప్పాలి.ఈరోజు కూడా అదే సీన్ కంటిన్యూ అవుతుంది.మా పిన్నీ, బాబాయ్ రాగానే అంతా వాళ్లకి చెప్పేసి ఊరు వదిలి వెళ్లిపోతాను..’ అంటుంది సౌర్య. ‘అలా ఎలా వెళ్లిపోతావే అలా వెళ్తే మేమేం కావాలి?’ అనేస్తుంది సౌందర్య కంగారులో. ఇక సౌర్య అదేంటి నేను ఎవరో మీరు ఎవరో.. ఏదో మనం రైల్లో ప్రయాణికుల్లా కలిశాం కదా సీసీ.ఎవరి స్టేషన్ రాగానే వాళ్లం దిగిపోతాం కదా అంటుంది జ్వాల అనుమానంగా చూస్తూ. ఇక వెంటనే సౌందర్య కవర్ చేస్తూ ‘అవును కానీ.. అనుకోకుండా ఇంతలా కలిసిపోయాం కదా అని అలా అంటున్నాం అంటుంది.. దాంతో సౌర్య మనసులో హమ్మయ్య నేను ఎవరో వీళ్లకి తెలినట్లే ఉంది అనుకుంటుంది.
రౌడీలను పోలీసులకు పట్టించిన జ్వాల :
ఇక సీన్ కట్ చేస్తే జ్వాల చీకటి అయిపోయిందని ఇంటికి వెళ్లే సమయంలో ఓ ఇద్దరు కంగారుగా వచ్చి ‘అమ్మాయి మంగల్ ఆర్ట్కి వెళ్లాలి’ అంటారు. ‘ఈ టైమ్లోనా..అది చాలా దూరం’ అంటుంది జ్వాల. నీకు ఎంత కావాలంటే అంత తీసుకో.. అర్జెంటు అమ్మా..కాదు అనకు’ అంటారు వాళ్లు.అయితే వాళ్లిద్దరూ చూడటానికి రౌడీల్లా ఉంటారు. ఇక ‘సరే ఎక్కండి అని ఆటో ఎక్కించుకుని ఎక్స్ట్రా డబ్బులేం అవసరం లేదులే’ అంటుంది జ్వాల. ఇక వెళ్తూ వెళ్తూ ‘రేయ్ మనం కలకత్తా రైలు అందుకుంటాం కదా? భయంగా ఉందిరా’ అంటాడు ఒకడు కంగారుగా. ‘రేయ్ ఏం భయపడకు.. ఈ ఐదు లక్షల కోసం.. పోలీసులు కలకత్తా దాకా రారులే.. మనం వెళ్తున్నాం అంతే’ అంటూ ధైర్యమిస్తాడు మరొకడు.వీళ్ళ మాటలు జ్వాల విని డైరెక్ట్గా ఆటోను పోలీస్ స్టేషన్ దగ్గర ఆపుతుంది. వాళ్లు షాక్ అవుతారు. పారిపోయే ప్రయత్నం చేయగా వాళ్ళని పట్టుకుని పోలీస్ సలకు అప్పగిస్తుంది. ఎస్ఐ ‘ఎవరమ్మా వీళ్లు?’ అనడంతో జ్వాలతో. ‘వీళ్ల 5 లక్షలు దొంగతనం చేసి.. కలకత్తా పారిపోవాలి అనుకుంటుంటే తీసుకొచ్చాను సార్’ అంటుంది జ్వాల. వెరీ గుడ్ అమ్మా అని. జ్వాలను పొగుడుతాడు.రౌడీలు మాత్రం జ్వాలని చూస్తూ రగిలిపోతారు.
నిరూపమ్ ను చూసి ఎమోషనల్ అయిన జ్వాల :
ఇక జ్వాల మరో కిరాయి తీసుకుని మరో చోటకి వెళ్తుంది. ఆటో దిగిన వ్యక్తి 5 వందలు చిల్లరి లేదు అనడంతో చిల్లర కోసం అక్కడున్న వారందరినీ అడుగుతుంది. అప్పుడే కారు ఎక్కబోతున్న నిరుపమ్ని వెనుక నుంచి ‘సార్ 5 వందలు చిల్లర ఉందా?’ అని అడుగుతుంది జ్వాల. వెనక్కి తిరుగుతాడు నిరుపమ్. ఆ కారులో హిమ ఉంటుంది. వాళ్ల మాటలు వింటుంది. నిరుపమ్ వెంటనే 5 వంద నోట్లు తీసి జ్వాలకు ఇచ్చి జ్వాల దగ్గర ఉన్న 5 వందల నోట్ తీసుకుంటాడు.‘ఏదొక అద్భుతం జరిగి వీళ్లు కలిస్తే బాగుండు.. వీళ్ల పెళ్లి అయితే బాగుండు.. నేనేం చెయ్యలేకపోతున్నా’ అని హిమ లోపల కూర్చుని బాధపడుతుంది. మరోవైపు జ్వాల ఇంటికి వచ్చి నిరుపమ్ ఇచ్చిన డబ్బుల్ని చూస్తూ ఎమోషనల్ అయ్యి ఆ డబ్బులను దాచుకోవాలి అనుకుని దేవుడి దగ్గరకు తీసుకుని వెళ్లి పెడుతుంది.
జ్వాలకు సన్మానం:
సీన్ కట్ చేస్తే.. ఓ ఇద్దరు పెద్దవాళ్లు జ్వాల ఇంటికి వచ్చి అమ్మా జ్వాల అంటే మీరే కదా.. దొంగల్ని పట్టించి చాలా గొప్ప పని చేశారు.. మేము హైదరాబాద్ క్లబ్ నుంచి వచ్చాం.పోలీసులు మాకు మీ అడ్రస్ ఇచ్చారు. మీరు చేసిన మంచి పనికి మీకు అవార్డ్ ఇవ్వాలనే వచ్చాం.. ఈ ఇన్విటేషన్లో టైమ్, ప్లేస్ అన్ని వివరాలు ఉన్నాయి.. మీరు తప్పకుండా రావాలి’ అని చెబుతారు. నాకు అవార్డ్లు అవీ ఎందుకు సార్’ అంటుంది జ్వాల. ‘లేదమ్మా నీలాంటి వాళ్లు ఆదర్శంగా నిలబడినప్పుడే కదా.. మిగిలి వాళ్లు స్పూర్తిని పొందేది.. మీరు తప్పకుండా రావాలి’ అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతారు వాళ్లు.
పెళ్లి షాపింగ్ లో నిరూపమ్, హిమలు:
మరోవైపు హిమ తన తల్లిదండ్రుల ఫొటో ముందు నిలబడి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో నిరుపమ్ వచ్చి.. ‘పద హిమా పెళ్లి షాపింగ్ చేద్దాం అంటూ హిమను తీసుకుని వెళ్తాడు.ఇక దారిలో కొబ్బరి బొండాలు తాగుతారు హిమ, నిరుపమ్లు కొబ్బరి బొండాలు తాగిన తర్వత జ్వాల ఇచ్చిన 5 వందల నోట్ తీసుకుని.. బొండాలమ్మే వ్యక్తికి నిరూపమ్ ఇవ్వడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!