రాజకీయాల్లో చిత్రాలు కామన్. ఒక పార్టీ నుంచి మరోపార్టీలోకి నాయకులు జంప్ చేస్తారు. అయితే.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నాయకులు గత ఏడాది టీడీపీ తరఫున పోటీ చేయగా.. ఇప్పుడు వారే.. వైసీపీ తరఫున బరిలో దిగుతున్నారు. దీంతో రాజకీయాలు ఆసక్తి గా మారాయి. వీరిలో ఒకరు గెలిచిన ఎమ్మెల్యే ఉండగా.. మరొకరు ఓడిన నాయకుడు కూడా ఉన్నారు. దీంతో వీరి గెలుపుపై తాజాగా ఆసక్తి నెలకొంది.
వారే.. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్. మరొకరు దేవినేని అవినాష్. వీరిలో వంశీ సిట్టింగ్ ఎమ్మెల్యే. సుదీర్ఘకాలంగా ఆయన టీడీపీలోనే ఉన్నారు. అయితే.. 2019 ఎన్నికల్లో విజయం దక్కించుకున్నాక.. అనూహ్యంగా వైసీపీ బాట పట్టారు. ఈ క్రమంలోనే కండు వా మార్చుకోకుండానే ఆయన అప్పట్లో వైసీపీకి మద్దతు పలికారు. ప్రస్తుతం ఇదే గన్నవరం వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే.. ఈసారి వైసీపీ టికెట్పై ఆయన పోటీకి దిగడం గమనార్హం.
ఇక, అవినాష్.. గత 2019 ఎన్నికల వరకు టీడీపీలో ఉన్నారు. అప్పట్లో కీలకమైన గుడివాడ నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్పై పోట చేసి .. బలమైన పోటీ ఇచ్చారు. అయితే.. స్థానికేతరుడు అనే ముద్ర పడడం తో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత ఈయన కూడా.. వైసీపీలోకి చేరిపోయారు. అంతేకాదు… సీఎం జగన్కు ఎంతో ఇష్టమైన నాయకుడిగా కూడా పేరు తెచ్చకున్నారు. ప్రస్తుతం ఆయనకు ఎంతో ఇష్టమైన విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
అది కూడా వైసీపీ టికెట్పైనే కావడం గమనార్హం. మరి వీరు ఏమేరకు గెలుపు గుర్రాలు ఎక్కుతారో చూడాలి. గన్నవరంలో అయితే.. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు.. ఇప్పుడు టీడీపీ టికెట్పై పోటీ చేస్తున్నారు. ఇదొక కీలక మార్పు. దీనిని గన్నవరం ప్రజలు ఏమేరకురిసీవ్ చేసుకుంటారు. వారు వీరైన నాయకులను ఏమేరకు గెలిపిస్తారనేది చర్చగా మారింది.