Tollywood Producer : రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది. రోజుకు లక్షలాది మంది కరోనా బారిన పడుతున్నారు. ఓ పక్క వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కరోనా భయం వెంటాడుతూనే ఉంది. కరోనా మొదటి దశలోనే ఎంతో మంది నటీనటులు, గాయకులను కరోనా కాటుకు బలి అయ్యారు. ఇప్పుడు తాజాగా ఓ నిర్మాత మృత్యవాత పడ్డారు. ప్రకాశం జిల్లాకు చెందిన టాలివుడ్ నిర్మాత సిఎన్ రావు (చిట్టి నాగేశ్వరరావు) హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పంపిణీ దారుడుగా, నిర్మాతగా చిరపరిచితులైన సిఎస్ రావు తెలుగులో అనేక సినిమాలు తీశారు. మా సిరిమల్లె, అమ్మా నాన్న లేకుంటే, బ్రహ్మానందం డ్రామా కంపెనీ లాంటి మువీలే కాకుండా అటు తమిళంలో “ఊరగా” అనే సినిమాను నిర్మించారు.
ఆయన ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సంయుక్త కార్యదర్శిగా, అలాగే తెలుగు సినిమా బిజినెస్ మండలి కార్యవర్గ సభ్యుడిగా, నిర్మాతల సెక్టార్ కార్యదర్శిగా, సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా పని చేశారు. నిర్మాత సిఎన్ రావు మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన ఈ మధ్య కాలంలో రెండు చిన్న సినిమాలు నిర్మించేందుకు సన్నాహం అవుతుండగా కరోనా బారిన పడ్డారు. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించగా ఇతర అనారోగ్య సమస్యలతో ఆరోగ్య పరిస్థితి విషమంగా మారి తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!