శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగంపై అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ కాకినాడ సభలో శ్రీవాణి ట్రస్ట్ విరాళాలకు సక్రమంగా రసీదులు ఇవ్వడం లేదని ఆరోపణలు చేశారు. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు.
శ్రీవారి ట్రస్ట్ నిధుల వినియోగంతో 2,445 ఆలయాల నిర్మాణం చేపడతామని తెలిపారు. గోశాలల నిర్వహణ, ఆలయాల ధూపదీప నైవేద్యాలకు శ్రీవాణి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేసం జరిగింది. ఈ సమావేశ తీర్మానాలను చైర్మన్ వైవీ వెల్లడించారు.
సమావేశ తీర్మానాలు
- రూ.40.50 కోట్లతో వ్యర్ధాల నిర్వహణ కోసం ప్రైవేటు ఏజన్సీకి అనుమతి
- ఒంటిమిట్ట రామాలయంలో దాతల సాయంతో రూ.4 కోట్లతో అన్నదాన భవనం
- రూ.4.16 కోట్లతో తిరుమలలో అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణం
- రూ.1.28 లక్షలతో వసతి గృహాల ఆధునికీకరణ
- తిరుమలలో రూ.3.55 కోట్లతో పోలీస్ క్వార్టర్స్ ఆధునికీకరణ
- రూ.7.44 కోట్లతో టీటీడీ పరిధిలో అధునిక కంప్యూటర్లు
- శ్రీవెంకటేశ్వర వేదిక్ విశ్వవిద్యాలయంలో రూ.5కోట్లతో వసతి గృహాలు
- రూ.97 కోట్లతో స్విమ్స్ ఆసుపత్రి ఆధునికీకరణకు ఆమోదం
- రూ.9.5 కోట్లతో తిరుపతిలో సెంట్రలైజ్డ్ గోడౌన్ కు ఆమోదం
- రూ.6.65 లక్షలతో తిరుచానూరు పద్మావతి అమ్మవారి పుష్కరిణి అధునికీకరణకు ఆమోదం
- శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఖండిస్తూ తీర్మానం
- శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా దాదాపు 300 పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు ఆమోదం
- రాజకీయ లబ్దికోసం టీటీడీపై దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని తీర్మానం ఆమోదం