Ukraine Crisis: ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత పౌరులు, విద్యార్ధులను తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ నుండి రాష్ట్రానికి వచ్చే విద్యార్ధుల విమాన ఖర్చులను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులకు ఆదేశించారు. ఢిల్లీకి చేరుకునే విద్యార్ధులకు అక్కడి నుండి సొంత ప్రాంతాలకు చేర్పించేలా ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అందుకు తగినట్లు ఏపి భవన్ నుండి విద్యార్ధులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Read More: Russia Ukraine War: సాయం కోరుతూ మోడీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఫోన్
Ukraine Crisis: ఏడు యూనివర్సిటీల్లో 423 మంది ఏపి విద్యార్ధులు
ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులతో బయలుదేరిన తొలి విమానం చేరుకుంది. మరో విమానం ఈ రాత్రికి ఢిల్లీకి చేరుకుంటుంది. విద్యార్ధులను రప్పించేందుకు ఏపి ప్రభుత్వం ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారి కృష్ణబాబు నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ ఉక్రెయిన్ లోని ఏడు యూనివర్సిటీల్లో 423 మంది విద్యార్ధులు మెడిసిన్ చదువుతున్నట్లు గుర్తించింది. ఈ రోజు విమానంలో 13 మంది ఏపి విద్యార్ధులు వస్తున్నట్లు సమాచారం వచ్చినప్పటికీ తొలి విమానంలో ముగ్గురు ఏపి విద్యార్ధులే ఉక్రెయిన్ నుండి వచ్చారు.
Read More: Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణకు సిఎం జగన్ ఫుల్ సపోర్టు..! ఇదీ ఫ్రూఫ్
Ukraine Crisis: ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్ కు
ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఏపి ప్రభుత్వం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. ఏపి విద్యార్ధులను సరిహద్దులకు వెళ్లవద్దని సూచించామని టాస్క్ ఫోర్స్ కు నేతృత్వం వహిస్తున్న కృష్ణబాబు తెలిపారు. ఉక్రెయిన్ లో ఉన్న ఏపి విద్యార్ధులు తమతో టచ్ లో ఉన్నారనీ, వారిని తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఢిల్లీకి వచ్చే ఏపి విద్యార్ధులను తొలుత ఏపీ భవన్ కు తరలిస్తామని అక్కడి నుండి ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్ కు తీసుకువస్తామని ఆయన చెప్పారు.