YS Jagan : ఏపీ ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ను టార్గెట్ చేయడంతో పాటుగా ఆయన ప్రధాన సన్నిహితులను సైతం ఇరుకున పెట్టేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ను ఇరుకున పడేస్తున్నారు. అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో ఆయనకు బీపీ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో
అచ్చన్న సొంత గ్రామంలో ఏకగ్రీవం చేయాలని టీడీపీ ప్రయత్నం చేసింది. హైడ్రామా తీవ్ర ఉధ్రిక్తతల నడుమ ఎట్టకేలకు నిమ్మాడలో వైసీపీ తరపున కింజరాపు అప్పన్ననామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ అభ్యర్థి కింజరాపు అప్పన్నతో టెక్కలికి చెందిన దువ్వాడ శ్రీనివాస్ రావడంతో టీడీపీ వర్గీయులు ఆందోళన వ్యక్తం చేశారు. దువ్వాడతో సహా నామినేషన్ వేసే అభ్యర్ధిని నామినేషన్ కేంద్రంలోకి రాకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు , టీడీపీ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. కింజరాపు అప్పన్నకు పోలీసులు భద్రతా వలయంగా మారి నామినేషన్ దాఖలు చేయించారు.
YS Jagan : టీడీపీ చివరి ప్రయత్నం…
వైసీపీ అభ్యర్ధిని నామినేషన్ వేయకుండా అచ్చెన్నాయుడు సోదరుడు హరివరప్రసాద్ , టీడీపీ వర్గీయులు అడ్డుకున్నట్టు చెబుతున్నారు. అయితే వైసీపీ సర్పంచ్ అభ్యర్థి కింజరాపు అప్పన్నకు అచ్చెన్నాయుడు ఫోన్ చేసినట్టు చెబుతున్నారు. పోటీ నుంచి తప్పుకోవాలంటూ ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది. అయితే, టీడీపీ ఒత్తిడికి తలొగ్గకుండా వైసీపీ నేతలు బరిలో దిగుతున్నట్లు సమాచారం.