Vijayshanthi : బిజెపి పార్టీలో కీలకంగా రాణిస్తున్న విజయశాంతి టిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేసుకుని భారీ డైలాగులు వేశారు. ఇదిలా ఉంటే అయోధ్య రామాలయం గురించి టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై విజయశాంతి స్పందిస్తూ ఎంఐఎం పార్టీని కార్నర్ చేస్తూ కేసిఆర్ పై విరుచుకుపడ్డారు. మేటర్ లోకి వెళ్తే అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయం విషయంలో తరచుగా భద్రాద్రి ఆలయం గురించి టిఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు.
కానీ అయోధ్య రామాలయం దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు భక్తిభావంతో రామయ్య జన్మభూమిలో స్వచ్ఛందంగా నిర్మించుకున్నారని పేర్కొన్నారు. ఇదే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి ఇలాగే భద్రాద్రిలో కూడా ఆలయాన్ని భక్తిభావంతో గొప్పగా తీర్చిదిద్దాలని అప్పుడు ప్రజలందరూ హర్షిస్తారు అంటూ విజయశాంతి చెప్పుకొచ్చారు. కానీ ఈ విషయంలో సీఎం కేసీఆర్ అంతగా ఆసక్తి చూపటం లేదని భద్రాద్రి లో భారీ స్థాయిలో పనులు చేపడతామని మంత్రులతో మెలికలు పెట్టిస్తున్నారు అంటూ సెటైర్లు వేశారు. ఇద్దరు మంత్రులు అయోధ్య రామాలయానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఖండించలేని ముఖ్యమంత్రి.. రామాలయానికి అనుకూలమా కాదా స్పష్టంగా వైఖరి చెప్పాలని లేదా నేను మాటల్లోనే హిందువుని.. అయోధ్య విషయంలో ఎంఐఎం కు బంధువునని చెబుతారో… కేసీఆర్ తేల్చుకోవాలి’ అని విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు.