YS Jagan : ఏపీ ముఖ్యమంత్రి , వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సోదరి వైఎస్ షర్మిల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారా? తెలంగాణలో పార్టీ ఏర్పాటు విషయంలో వైఎస్ షర్మిల షాకుల పరంపర కొనసాగుతోందా? ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకుంటున్నారా? ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్.
షర్మిల షాక్ ఇస్తుందా?
తెలంగాణ లో పార్టీ ఏర్పాటు విషయంలో షర్మిల దూకుడుగా ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వైఎస్ఆర్ అభిమానులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్న షర్మిల అనంతరం ముఖ్య అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. తర్వాత సమావేశం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వైఎస్ అభిమానులతో జరగనుంది. ఈనెల 21న ఖమ్మం జిల్లాలో షర్మిల మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు లోటస్ పాండ్ నుంచి వైఎస్ షర్మిల భారీ కాన్వాయ్తో ఖమ్మం వెళ్లనున్నారు. అక్కడ వెయ్యి మంది వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం ఉంటుందని.. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ సమావేశం కొనసాగుతుందని సమాచారం.
YS Jagan జగన్ బ్రేకులు
ఇదే సమయంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటు వైఎస్ షర్మిలతో అటు బ్రదర్ అనిల్తో కూడా సుదీర్ఘ మంతనాలు జరిపారు. వైఎస్ కుటుంబానికి వీరవిధేయుడిగా ఉన్న ఆర్కేకు.. షర్మిలతో, బ్రదర్ అనిల్తో మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం లోటస్పాండ్కు వచ్చిన ఆర్కే.. దాదాపు గంటకు పైగా షర్మిలతో మంతనాలు జరిపారు. ఆ తర్వాత బ్రదర్ అనిల్తో దాదాపు 3 గంటలకు పైగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. వైఎస్ జగన్కు సన్నిహితుడిగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఆయన దూతగానే చర్చలకు వచ్చారనే చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. షర్మిల పార్టీ ఏర్పాటు విషయంలో దూకుడుగా ముందుకు వెళ్తుండగా.. ఆమెను ఆపే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా..? అనే చర్చ కూడా మొదలైంది. అయితే, ఖమ్మం పర్యటన విషయంఓల షరమ్ఇల తన నిర్ణయం ఉపసంహరించుకోకపోవడం చూస్తుంటే పార్టీ ఏర్పాటు విషయంలో సీఎం జగన్ కు ఆమె షాక్ ఇవ్వడం ఖాయమని అంటున్నారు.