నితిన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `రంగ్ దే`. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నితిన్ సరసన కీర్తిసురేశ్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. వెంకీ అట్లూరి దర్శకుడు. ఈ చిత్రానికి రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. నితిన్ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఈ విషయాన్ని వెంకీ అట్లూరి ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ దేవిశ్రీ ప్రసాద్తో ఉన్న ఫొటో షేర్ చేశాడు.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!