Prabhas: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియన్ చిత్రాలలో ఆదిపురుష్ కూడా ఒకటి. ఈ మూవీపై తాజాగా ఓ న్యూస్ వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమాను ఎలా ఎప్పుడు రిలీజ్ చేయాలా అని మేకర్స్ తల బాదుకుంటున్నారు. ఇప్పటికే చాలాసార్లు పోస్ట్ పోన్ అయిన ఈ సినిమాను మార్చ్ 17న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఈ ఏడాది ఆగస్టు 11న రిలీజ్ చేస్తామని ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సినిమా ఆదిపురుస్. ప్రభాస్ బాలీవుడ్లో నటిస్తున్న ఫస్ట్ స్ట్రైట్ సినిమా కావడం విశేషం.
ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నాడు. బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇది పాన్ ఇండియన్ కాదు పాన్ వరల్డ్ సినిమా అని చెప్పాలి. ఎందుకంటే ఆదిపురుష్ సినిమాను తెలుగు, హిందీతో పాటు మిగతా సౌత్ భాషల్లోనూ అలాగే ఇంగ్లీష్ భాషలోనూ రిలీజ్ చేయనున్నారు. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కృతీ సనన్ ప్రభాస్ సరసన సీతగా కనిపించనుండగా..సైఫ్ అలీఖాన్ రావణ పాత్రలో సన్నీ సింగ్ లక్ష్మణ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ప్రభాస్ సహా ప్రధాన తారాగణమంతా తన షూటింగ్ పూర్తి చేశారు.
Prabhas: ఇంకా ప్రమోషన్స్ వరకూ రానేలేదు.
అయితే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఆదిపురుష్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 20 వేల థియేటర్స్లో రిలీజ్ చేయనున్నారంటూ వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఇది నిజమే అని భావిస్తున్నారట. కానీ చిత్ర యూనిట్ దీనికి సంబంధించిన ఎలాంటి న్యూస్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. అసలు రిలీజ్ కాదు ఇంకా ప్రమోషన్స్ వరకు రానేలేదు. అప్పుడే 20 వేల థియేటర్స్ అంటూ ఇంత పెద్ద రూమర్ ఏంట్రా బాబూ అంటూ కామెంట్స్ చేస్తున్నారట. ఇంగ్లీష్లో మాత్రం ఆదిపురుష్ చిత్రాన్ని రులీజ్ చేయడం పక్కా. కానీ, ఎన్ని వేల థియేటర్స్ అనేది మాత్రం అప్పుడే డిసైడ్ చేసేది కాదని అర్థమవుతోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!