F3 : వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలు,గా తమన్నా, మెహరిన్ హీరోయిన్లుగా నటించిన ఎఫ్ 2 చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందిన విషయం మనకు తెలిసినదే. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్ గా ఎఫ్3 చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఎఫ్2 సినిమాలో కుటుంబ కలహాల వల్ల భార్య భర్తల మనస్పర్థల వల్ల గొడవపడగా, ఎఫ్ 3 లో డబ్బులు వల్ల కుటుంబంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి. అనే నేపథ్యంలో దర్శకుడు తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ లో సినిమా కాన్సెప్ట్ ను చెప్పకనే చెప్పారు దర్శకులు. ఇదిలా ఉండగా ఎఫ్2 సినిమాలు ఇద్దరు హీరోలు నటించగా, ఎఫ్ 3 లో ముగ్గురు హీరోలు నటిస్తున్నారని సమాచారం గత కొద్దిరోజుల నుంచి వినబడుతోంది.అయితే ఈ సినిమాలో హీరోగా ఓ తరుణంలో మహేష్ బాబు లేదా రవితేజ నటిస్తున్నారానే వార్తలు వినిపించాయి. మరి కొద్ది రోజులకు ఈ సినిమాలో గోపీచంద్,మెగాహీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్నారని వార్తలు వచ్చినప్పటికీ ఈ విషయంపై చిత్రబృందం ఏవిధంగా స్పందించలేదు.
తాజాగా ఈ చిత్రం గురించి దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఈ చిత్రం పై వస్తున్న మూడో హీరో గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు. ఇప్పటివరకు ఈ సినిమాలో మూడో హీరోగా ఫలానా వాళ్ళు నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే వాటిలో ఏమాత్రం వాస్తవం లేదని దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. అసలు ఈ సినిమాలో మూడో హీరోకి సంబంధించిన పాత్ర లేదని, ముగ్గురు హీరోలతో ఈ సినిమా తెరకెక్కించాలనే ఆలోచనే తనకు రాలేదని దర్శకుడు తెలియజేశారు.ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు అనిల్ రావిపూడి ఈ సందర్భంగా తెలియజేశారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!