ఆరుడుగుల అందంతో ఎంతో మంది ప్రేక్షకుల ఆదరణను సంపాదించుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. “అల్లుడు శీను” మూవీతో బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగు ఇండస్ట్రీకి తెరంగేట్రం చేశారు. ఫస్ట్ మూవీతోనే స్టార్ హీరోయిన్ తో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు ఈ హీరో.. దాని తర్వాత ఈ హీరో సినిమాల్లో బిజీ బిజీ గా మారారు. అయితే అందులోనూ హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సరసన నటించిన “జయజానకీ నాయక” బాక్సా ఫీస్ ను బద్దలు కొట్టింది. అలాగే “సీత” చిత్రం లో స్టార్ నటి కాజల్ అగర్వాల్ తో రొమాన్స్ చేశాడు. అలాగే తమన్నా, పూజ హెగ్డేలాంటి అగ్ర కథానాయిక ల సరసన నటిస్తూ ఈ హీరో విజయాల బాట పడుతున్నారు.
మరి కొత్త హీరో సరసన అంత ఈజీగా స్టార్ హీరోయిన్లు ఎలా నటిస్తున్నారనేది చాలా మందికి ప్రశ్నగానే మిగిలింది. అందుకు కూడా కారణముందండోయ్..! ఏంటంటారా.. మన బెల్లంకొండ తన సరసన నటించే స్టార్ హీరోయిన్లకు మంచి పారితోషికాన్ని అందిస్తున్నారంట.. అందుకే ఈ హీరో సరసన నటించేందుకు హీరోయిన్లు ముందుకు వస్తున్నారాని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమనేది మాత్రం తెలియనిది. అయితే తాజాగా వి వి. వినాయక్ దర్శకత్వంలో ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి సిద్దమయ్యారు బెల్లంకొండ.
అయితే శ్రీనివాస్ తన బాలీవుడ్ డెబ్యూలో కూడా స్టార్ హీరోయిన్ కోసం వెతుకుతున్నారట. ఏ స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నారట బెల్లంకొండ. అయితే ఈ సినిమాలో బెల్లంకొండ సరసన కియారా అద్వానీ ఉంటే బాగుంటుందని బెల్లంకొండ భావిస్తున్నాడట. అయితే అధిక పారితోషికం ఇచ్చి తన సినిమాల్లో నటించే విధంగా చేస్తారుగా.. అయితే మరి ఈ మూవీలో హీరోయిన్ గా అనుకుంటున్న కియారాకు ఎంత పారితోషికం ఇవ్వబోతున్నారో అనేది హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు.
అయితే కియారాకు అటు టాలీవుడ్ లోనూ, ఇటు బాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఉంది. అయితే ఈ అమ్మడు బాలీవుడ్ లో ప్రముఖ స్థానం సంపాదించుకున్న హీరోల సరసన నటిస్తున్నది. అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమాల ద్వారా కూడా ఈ ముద్దుగుమ్మ మంచి పేరును సంపాదించుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి టైంలో ఆమె బెల్లంకొండ సరసన నటిస్తుందన్న నమ్మకం కూడా లేదు. కాని ఆమెను ఒప్పించడానికి ఆమెకు మరి ఎంత పారితోషికం ఆఫర్ చేస్తారో చూడాలి మరి..!
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!