కరోనా నుంచి దేశంలోని వ్యవస్థలతో పాటు సినీ పరిశ్రమ కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. షూటింగ్స్ మొదలయ్యాయి. ధియేటర్లు ఓపెన్ అయ్యాయి. అయితే.. కరోనా తీవ్రత మాటున అన్ని జాగ్రత్తలతో షూటింగ్స్ జరుగుతున్నాయి. అయితే.. ఇప్పుడు సినిమా షూటింగ్స్ పై మళ్లీ ప్రభావం చూపే వార్త సంచలనం రేపుతోంది. ప్రముఖ తమిళ హీరో రజినీకాంత్ తన ‘అన్నాతే’ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని ఆర్ఎఫ్ సీలో షూటింగ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా షూటింగ్ ఆగిపోయిందనే వార్త తమిళ సినీ వర్గాల్లో సంచలనం రేపుతోంది.
కారణం.. అన్నాతే సెట్లోని 8 మందికి కరోనా సోకడమే. ఈ వార్త నిజమేనని వార్తలు వస్తున్నాయి. సెట్లోని వారికి చేసిన కరోనా పరీక్షల్లో వీరికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో వీరందరినీ క్వారంటైన్ కు పంపినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా రజినీకాంత్ కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ పరీక్షల్లో రజినీకాంత్ కే నెగటివ్ వార్తలు వచ్చినట్టు చెన్నై మీడియా తెలిపింది. రీసెంట్ గానే రజినీకాంత్ అన్నాతే షూటింగ్ కు హైదరాబాద్ వచ్చారు. హీరోయిన్ నయనతార కూడా షూటింగ్ లో పాల్గొంది. వీరి పొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి కూడా. ఇప్పుడు షూటింగ్ లోని కొందరికి కరోనా సోకడంతో టీమ్ లో కలకలం రేపుతోంది.
దీంతో అన్నాతే షూటింగ్ ను ఆపేశారని తెలుస్తోంది. ఇప్పటికే రజీనీకాంత్ చెన్నై చేరుకున్నారని కూడా అంటున్నారు. త్వరితగతిన షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్ 31న తన పొలిటికల్ పార్టీ ప్రకటన చేయాలని భావించారు. కానీ.. మళ్లీ షూటింగ్ వాయిదా పడింది. కరోనా, లాక్ డౌన్ సమయంలో వాయిదా వేసిన అన్నాతే షూటింగ్ మళ్లీ వాయిదా పడినట్టే. మళ్లీ ఎప్పుడు షూటింగ్ ప్రారంభమవుతుందో సినిమా నిర్మిస్తున్న సన్ పిక్చర్స్ తెలపాల్సి ఉంది. మరోవైపు రాజీకీయాల్లో బిజీ కావాల్సిన రజినీ ఈ సినిమా షూటింగ్ మళ్లీ వాయిదా పడటం ఆయనకు, ఫ్యాన్స్ కు షాకిచ్చేదే.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!