బాలీవుడ్ స్టార్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఈ కేసుకు సంబంధించి సిబిఐ విచారణకు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఇటీవల హాజరయ్యింది. కేసుకు సంబంధించి సిబిఐ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఎక్కడ ఎలాంటి క్లూ దొరికిన విడిచిపెట్టడం లేదు. పరిస్థితి ఇలా ఉండగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి డ్రగ్స్ అందించే వారితో రియా చక్రవర్తికి లింకులు ఉన్నట్లు… వారితో ఆమె కాంటాక్ట్ అయ్యి ఎప్పటికప్పుడు సుశాంత్ ఆరోగ్య విషయాలు తెలుసుకున్నట్లు ఇటీవల ఈడి విచారణలో తేలింది.
అంతేకాకుండా సుశాంత్ తండ్రి తరఫు న్యాయవాది రియా చక్రవర్తి పై సంచలన ఆరోపణ చేశారు. సుశాంత్ కి తెలియకుండానే అతడికి నిషేధిత డ్రగ్స్ ఇవ్వటం జరిగిందని అందుకే సుశాంత్ సింగ్ మరణించాడని ఆరోపించారు. అతనికి తెలియ కుండానే అతని బాడీ లోకి డేంజరస్ డ్రగ్ రియా చక్రవర్తి ఎక్కించింది అన్నట్టుగా సుశాంత్ తండ్రి తరుపు లాయర్ ఆరోపించారు. అంతేకాకుండా అంతకు ముందు నుంచే రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ కి లేనిపోని మందులు కూడా ఇచ్చినట్లు సుశాంత్ కుటుంబ సభ్యులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.
అంతేకాకుండా డాక్టర్ సూచించిన మందులను కాకుండా రియా చక్రవర్తి అదనంగా వేరే మందులు ఇవ్వటం జరిగేది అని….అందువల్లే సుశాంత్ సూసైడ్ చేసుకున్నాడా? లేకపోతే హత్య చేయబడ్డాడడా ? అనేది అనుమానంగా ఉందని కుటుంబ సభ్యులు ఎఫ్ఐఆర్ లో కంప్లైంట్ చేశారు. అంతేకాకుండా సుశాంత్ ఫస్ట్ ఫ్లోర్ లో నిద్రపోతూ ఉంటే రియా చక్రవర్తి మాత్రం ఎప్పుడూ పైఫ్లోర్ లో పార్టీ చేసుకుంటూ జల్సాలు చేసేదని ఇంట్లో ఉన్న పని వారి ద్వారా తనకు తెలిసింది అని సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ ఆరోపించారు.
మరోపక్క రియా చక్రవర్తి తరపు న్యాయవాది రియా కి డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని కావాలంటే రక్తపరీక్షలు చేసుకోవచ్చని సవాల్ చేస్తున్నారు. ఏది ఏమైనా సుశాంత్ సింగ్ కేసులో చాలా వరకు బయటపడుతున్న విషయాలు రియా చక్రవర్తి ని బోలో నిలబెట్టే టట్టు ఉన్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!