ఎన్నో తర్జనభర్జనల అనంతరం చివరికి సోనియా గాంధీ మళ్లీ జాతీయ కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నికైంది. ఇది అందరికీ తెలిసిన మాట. కానీ లోపల జరిగిన విషయం వేరే అని ఈ తంతు అంతా రియాలిటీకి చాలా భిన్నంగా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అంటే మన గాంధీ కుటుంబానికి… సీనియర్ నేతలకు సరిగ్గా పడడం లేదని చెబుతున్నారు. అసలు సంగతి ఏంటో ఒక సారి చూద్దాం….
ఇరుకున పడేశారే….
ముందు నుండి అందరూ అంటున్నట్టు అసలు పార్టీలో రాహుల్ గాంధీ పాత్ర ఏమీ లేదట. అతను నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి ససేమిరా అన్నాడు. ప్రియాంక గాంధీ కూడా పెద్ద సముఖంగా లేదు. ఇక వీరిద్దరూ అందుకున్న కొత్త పాట ఏమిటంటే తమ కుటుంబం నుండి కాకుండా ఈసారి కొత్త మనిషికి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తామని అనుకుంటున్నారట. అయితే ఇదే సమయంలో సీనియర్ నేతలు 23 మంది సోనియా గాంధీకి లేఖ రాయడంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ కూడా లేఖను తప్పు పట్టారు. సీనియర్ల వ్యవహారశైలి సరిగా లేదని భావించారు దీంతో ఒక్కసారిగా వారికి ఏం చేయాలో అర్థం కాలేదు.
అయ్యో…. పాపం..!
ఒకవైపు నుండి వస్తున్న మాటలు ఏమిటంటే గులాంనబీ ఆజాద్ వంటి నేతలకు ఈ మధ్య కాంగ్రెస్ హైకమాండ్ నుండి అపాయింట్మెంట్ లభించట్లేదు. అధ్యక్షుడు ఎవరో ఒకరిని ఉద్దేశించి అపాయింట్మెంట్ అడుగుదామంటే ఎవరూ కనిపించట్లేదు. సోనియాకి స్వయంగా వివరణ ఇవ్వాలని ఉన్నా ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కుదరడం లేదు. ఇక రాహుల్ గాంధీ పాత్ర ఏమిటో అతనికే అవగాహన లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలకు కిక్కు దిగింది. దశాబ్దాల కాలం పాటు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వాళ్ళు ఈ సమయంలో వేరే పార్టీకి వెళ్ళలేరు…. తాము నాయకులుగా ఎదిగేందుకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ ను వదులుకోలేరు. వాళ్ల పరిస్థితి చివరికి అటూ ఇటూ కాకుండా అయిపోయింది.
ఇదే వారు చేసిన తప్పు..
ఇక విశ్లేషకులు చెబుతున్న మాట ఏమిటంటే…. సోనియాగాంధీ అధ్యక్షురాలు పదవికి ఫిక్సయిపోయింది…. కాంగ్రెస్ సీనియర్ నేతలు మనసులో కూడా అదే ఉంది కానీ కొన్ని ముఖ్య పదవుల నుండి సీనియర్ నేతలను తప్పించి యువకులను ఇవ్వటాన్ని ప్రోత్సహించేందుకు ఇదంతా రాహుల్ గాంధీ ప్లాన్ అట. ఇదే సమయంలో సీనియర్లలో అసమ్మతి మొదలైతే పార్టీకి నష్టమని కావాలని వారు రాసిన లేఖలను సాకు పెట్టుకొని వారిని సీడ్బ్ల్యూసీ మీటింగ్ లో ఇష్టం వచ్చినట్లు కడిగిపారేసి తమ అదుపులో పెట్టుకున్నారట. ఇక గాంధీ కుటుంబం ఆడిందే ఆట…. పాడిందే పాట. పార్టీని నమ్ముకొని ఉన్న వారి పట్ల ఏ మాత్రం గౌరవం, కృతజ్ఞత భావం లేకుండా హైకమాండ్ వ్యవహరిస్తోంది అన్న వాదనలు వస్తున్నాయి. ఇక వీరు తమ బాధను వెల్ల్గక్కలేరు… జూనియర్లు రాజ్యం ఏలుతుంటే… చూసి ఓర్వలేక కాబట్టి ఒకే పార్టీని నమ్ముకుని ఎక్కువగా ఉండడం కూడా చివరికి చేటు అయిపోయిందని వారు వాపోతున్నారట.