నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో `భీష్మ` చిత్రం రూపొందనునున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సినిమా సెట్స్కు వెళ్లనుంది. `ఛలో` బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్గా నటించనున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్గా `హలో` ముద్దుగుమ్మ కల్యాణి ప్రియదర్శన్ నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే వీటిపై దర్శకుడు వెంకీ కుడుముల తన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. సినిమాలో ఒకరే హీరోయిన్గా నటిస్తున్నారని.. కల్యాణి ప్రియదర్శన్ నటిస్తుందని వినిపిస్తోన్న వార్తల్లో నిజం లేదని తెలియజేశాడు. దీంతో `భీష్మ` హీరోయిన్స్ విషయంలో సోషల్ మీడియాలో వస్తోన్న రూమర్స్కు దర్శకుడు వెంకీ కుడుముల చెక్ పెట్టాడు. ఫుడ్ పాయిజనింగ్ అనే పాయింట్ను ఎంటర్టైనింగ్ పంథాలో వెంకీ కుడుముల తెరకెక్కించబోతున్నాడట.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!