Mahesh – Trivikram: సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ #మహేశ్ 28 అనే వర్కింగ్ టైటిల్తో తాజాగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. మరోసారి మహేష్ తన సెంటిమెంట్ను ఫాలో అయ్యారు. ఈ మూవీ ప్రారంభోత్సవానికి కూడా ఆయన హాజరవలేదు. ఎప్పటి లాగానే మహేశ్ సతీమణి నమ్రత హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను మేకర్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. గతంలో మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో ఇంతకముందు అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల రిజల్ట్ గురించి అందరికీ తెలిసిందే.
అయితే, ఈ రిజల్ట్తో ఏ మాత్రం సంబంధం లేకుండా హ్యాట్రిక్ సినిమా చేసేందుకు వీరిద్దరు ఇప్పుడు రెడీ అయిపోయారు. ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారు. ఈ మూవీ ఓపెనింగ్ కార్యక్రమానికి పూజా హెగ్డే కూడా హాజరయైంది. ఇంతక ముందు మహేశ్ సరసన పూజా మహర్షి సినిమాలో హీరోయిన్గా నటించింది. ఇప్పుడు మహేశ్ 28లో రెండవసారి జతకడుతోంది. ఇక దర్శకుడు త్రివిక్రమ్ తో అలాగే నిర్మాతలతో ఆమెకు మూడవ సినిమా. ఇంతకముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురములో, అరవింద సమేత వీర రాఘవ సినిమాలలో నటించింది.
Mahesh – Trivikram: ఆ అంచనాలను త్రివిక్రమ్ అందుకుంటాడా..?
ఇలా సూపర్ హిట్ కాంబినేషన్ సెట్ అయింది. అయితే, మహేష్ గత చిత్రాలు మహర్షి, భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. అలాగే, త్రివిక్రమ్ గత చిత్రాలు అరవింద సమేత, అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్స్ సాధించాయి. దాంతో ఇప్పుడు వీరి హ్యాట్రిక్ మూవీ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, ఎక్కడ ఖలేజా సినిమా సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ అవుతుందో అని మహేష్ అభిమానులు కాస్త సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మహేశ్ చేస్తున్న సర్కారు వారి పాట సినిమా మీద భారీ అంచనాలున్నాయి. అది హిట్ అయితే, మహేష్ – త్రివిక్రమ్ మూవీ మీద ఆ అంచనాలు మరింతగా పెరుగుతాయి. మరి ఆ అంచనాలను త్రివిక్రమ్ అందుకుంటాడా లేదా చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!