Geetha Arts: మహమ్మారి కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చాక మనిషి జీవితంలోనే కాదు వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇదే రీతిలో సినిమా రంగంలో కూడా మార్పులు వస్తున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులు చాలావరకు థియేటర్లకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడటంతో వారిని అట్రాక్ట్ చేయడానికి ఓటీటీ సంస్థలు కుప్పలు తెప్పలుగా వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమా నిర్మాతలు థియేటర్లలో రిలీజ్ చేయలేని పరిస్థితుల్లో ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారు.
చాలా సినిమాలు మహామారి రాకముందు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన క్రమంలో ..సినిమాలు పూర్తయ్యాక వైరస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత థియేటర్ లో క్లోజ్ కావడంతో నిర్మాతలు .. ఓటీటీ లో సినిమాలు రిలీజ్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ .. తమ బ్యానర్ లో నిర్మించే సినిమాలు ఏవి కూడా ఓటీటీలో రిలీజ్ చేసే ఆలోచనలో లేనట్లు ఇటీవల సరికొత్త స్టేట్మెంట్ ఇచ్చినట్లు ఫిలింనగర్ టాక్. అక్కినేని అఖిల్ నటించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమా ఓటీటీ లో విడుదలవుతున్నట్లు ఇటీవల వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇలాంటి తరుణంలో గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ నిర్మించే సినిమాలు ఏవి కూడా ఓటీటీ ప్లాట్ ఫాం లో రిలీజ్ చేసే ఆలోచన లేదని స్పష్టత ఇవ్వటం జరిగిందని టాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. అంతకుముందు కూడా చావు కబురు చల్లగా అనే సినిమా ఈ విషయంలో కూడా ఇటువంటి వార్తలు రాగానే ఖండించడం జరిగింది. తాజాగా మొత్తానికి ఓటీటీ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేటట్టు మాట్లాడటంతో .. వస్తున్న అన్ని వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!