SriLeela: మాటల రచయితగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో పాపులారిటీ తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ తర్వార మాటల మాంత్రికుడుగా మారి రచయితగా, దర్శకుడిగా స్టార్ స్టేటస్ అందుకున్నారు. దర్శకుడిగా మారిన తర్వాత ఆయన్ మీడియం రేంజ్ హీరో లతో చేసినవి కేవలం రెండు సినిమాలే. మిగతావన్ని పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబులతోనే సినిమాలు తీసి భారీ హిట్స్ అందుకున్నారు. ఇక అల వైకుంఠ పురంలో సినిమా తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు తన దర్శకత్వంలో రూపొందిన సినిమా ఏదీ రాలేదు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే, ఇటీవలే సూపర్ మహేష్ బాబుతో చేయబోతున్న సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో సిద్ధం అయింది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే. జూన్ నుంచి ఈ సినిమా సినిమా పట్టాలెక్కబో తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతు వైరల్ అవుతున్నాయి. ఇందులో హీరోయిన్గా మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్గా నటించబోతోంది. ప్రస్తుతం మహేశ్ నటించిన సర్కారు వారి పాట మే 12న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.
SriLeela: మహేశ్తో ఎక్కువ సీన్స్ ఉండేలా ప్లాన్..?
అయితే, త్రివిక్రమ్ సినిమాలలో సెకండ్ హీరోయిన్కు అంతగా ప్రాధాన్యం ఉండదు. ఇప్పటి వరకు నటించిన ప్రణీత, ఈషా రెబ్బా, నిత్యా మీనన్, అనుపమ పరమేశ్వరన్ లాంటి వారు చేసిన పాత్రలకు ప్రాధాన్యం లేకుండా పోయింది. దాంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో శ్రీలీలను తీసుకోవాలనుకుంటే ..సెకండ్ లీడ్కు ఇంపార్టెన్స్ ఉండదనే కారణంగా త్రివిక్రమ్ అడిగితే, నో చెప్పిందట. ఆమె నో చెప్పిన కారణంగా ఎలాగైనా శ్రీలీలను ఈ సినిమాలో నటింపచేయాలని తన పాత్రను డెవలప్ చేసి మహేశ్తో ఎక్కువ సీన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. అంతేకాదు, మహేశ్తో ఏ డ్యూయట్ కూడా పెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. అయితే, ఓ చిన్న హీరోయిన్ కోరిక మేరకు త్రివిక్రమ్ ఇంత మార్పులు చేస్తాడా..ఇది నమ్మడం కాస్త కష్టమే అని చెప్పుకుంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!