ప్రస్తుతం దక్షిణాదిన మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్లో కీర్తి సురేష్ ఒకరు. మహానటితో టాప్ హీరోయిన్స్ రేసులో ముందుకొచ్చిన కీర్తి సురేష్ మంచి మంచి అవకాశాలనైతే అందిపుచ్చుకుంటుంది. ఇప్పుడు బాలీవుడ్లోకి రంగ ప్రవేశం చేస్తుంది. అజయ్దేవగణ్ సరసన కీర్తి నటించనుంది. `బదాయి హో` దర్శకుడు అమిత్ శర్మ దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మాణంలో సయ్యద్ అబ్దుల్ రహీం బయోపిక్ రూపొందుతుంది. ఒకప్పుడు ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్గా, కోచ్గా సయ్యద్ అబ్దుల్ రహీం తనదైన ముద్ర వేశారు. ఆయన జీవితంలో కొన్ని అంశాలను తీసుకుని అమిత్ శర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో కీర్తిసురేష్ పాత్రపై ఆసక్తికరమైన వార్త ఒకటి హల్ చల్ చేస్తుంది. అదేంటంటే ఒకపక్క ఫుట్ ఆట గురించి చూపిస్తున్న పెళ్లైన ఇద్దరు వ్యక్తులు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అనే పాయింట్ను కూడా ఇందులో చూపిస్తున్నారట. అంటే కీర్తి సురేష్ పెళ్లైన గృహిణి పాత్రలో కనిపించే అవకాశాలున్నాయని బాలీవుడ్ వర్గాల సమాచారం.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!