Koratala Shiva: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్..ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా చూడని కొరటాల శివ నుంచి ఈ నెల 29న ఆచార్య సినిమా రాబోతోంది. దీని తర్వాత కొరటాల
శివ, ఎన్టీఆర్ కాంబోలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సారి కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా అంటే అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లో 30వ మైల్ స్టోన్ సినిమా కావడం విశేషం.
ప్రస్తుతం కొరటాల ‘ఆచార్య’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే పనుల్లో బిజీగా ఉన్నారు. ఇది మెగా మల్టీస్టారర్గా రాబోతుండటంతో మెగా అభిమానులతో పాటు అందరిలోనూ అంచలాను భారీగా నెలకొన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లను కొరటాల ఎలా చూపించారో తండ్రీ కొడుకులిద్దరూ సిల్వర్ స్క్రీన్ మీద ఎలా సందడి చేయనున్నారో అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాగా, ఆచార్య సినిమాను రిలీజ్ చేసిన కొరటాల కాస్త బ్రేక్ తీసుకొని ఎన్టీఆర్ 30 మూవీ వర్క్ను పూర్తి స్థాయిలో ప్రారంభించనున్నారు. తాజాగా ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు.
Koratala Shiva: ‘ఎన్టీఆర్ 30లో ఆలియా గురించి వస్తున్నవన్నీ రూమర్స్..
ఈ సందర్భంగా ఎన్టీఆర్ 30కి మే 28న నటీనటులు, మిగతా టెక్నీషియన్స్ను ప్రకటిస్తామని.. అలాగే, షూటింగ్ జూన్ నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. ఇదే సమయంలో ‘ఎన్టీఆర్ 30లో ఆలియా గురించి వస్తున్నవన్నీ రూమర్స్ అని..ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదని తేల్చిపారేశారు. దాంతో ఈ ప్రాజెక్ట్లో ఆలియా ప్రస్తుతానికి లేదనే క్లారిటీ వచ్చేసింది.