Manchu Vishnu: గత ఏడాది అక్టోబర్ నెలలో “మా” అధ్యక్ష ఎన్నికలలో రసవత్తరమైన పోరులో మంచు విష్ణు గెలవటం తెలిసిందే. అయితే గెలిచి ఏడాది కావటంతో అక్టోబర్ 13వ తారీకు గురువారం హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో మంచు విష్ణుతో పాటు మోహన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ… మా అధ్యక్షునిగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన 90 శాతం హామీలను నెరవేర్చినట్లు తెలిపారు. తాను “మా” సభ్యులకు మాత్రమే కాదు ప్రేక్షకులకు కూడా జవాబు దారి కాబట్టి ఈ విషయాలను వెల్లడిస్తున్నట్లు స్పష్టం చేశారు.
అంతేకాదు త్వరలో ఫిలిం ఛాంబర్ భవనం కూల్చి.. కొత్త భవనం నిర్మించడానికి అయ్యే ఖర్చును తానే భరిస్తానని మరోసారి స్పష్టం చేశారు. ఇంకా ఇదే సమయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సభ్యులు మాత్రమే సినిమాలో నటించాలని నిర్మాతలకు సూచించినట్లు విష్ణు కీలక ప్రకటన చేశారు. నిర్మాతలు కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటామని చెప్పినట్లు తెలిపారు. అంతేకాదు మా అసోసియేషన్ కి వ్యతిరేకంగా ఎవరైనా ధర్నాలు చేసిన.. సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారి సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక ఇదే సమయంలో మోహన్ బాబు మాట్లాడుతూ.. గతంలో తాను కూడా మా అధ్యక్షుడిగా ఉండటం జరిగిందని పేర్కొన్నారు. కానీ ఎప్పుడూ కూడా ఈ రీతిగా మీడియా సమావేశం నిర్వహించలేదు. ఇప్పుడు ఎందుకు మీడియా సమావేశం నిర్వహించామంటే చేసిన పని గొప్పగా చెప్పుకోవడానికి కాదు. అందరికీ తెలిసేలా సమాచారం కోసం అని పేర్కొన్నారు. ఇంక “మా” అధ్యక్షుడిగా మంచి విష్ణు చేసే పనుల్లో మోసం, దగా లేవని అన్నారు. ఈ క్రమంలో సినిమాల్లో “మా” సభ్యత్వం ఉంటేనే నటించాలని విష్ణు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!