Mahesh Babu : టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ డమ్ కలిగిన హీరోలలో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర హడావుడి మామూలుగా ఉండదు. మహేష్ సినిమా రిలీజ్ అయ్యే టైంలో ఇతర సినిమాల నిర్మాతలు తమ సినిమాలను రిలీజ్ చేయకుండా జాగ్రత్త పడతారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో హ్యాట్రిక్ విజయాలతో మంచి జోరుమీద ఉన్న మహేష్..గీతా గోవిందం డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్నారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు యాక్టింగ్ లో చాలావరకు మెలకువలు ఒక్కసారి గా మారిన సినిమాలు చేసింది ఏ డైరెక్టర్ తో అంటే ఖచ్చితంగా చెప్పవచ్చు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అని.
త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన అతడు, ఖలేజా సినిమాలు మహేష్ నటనలో కొత్త కోణాన్ని బయటపెట్టాయి. ఈ రెండు సినిమాలు థియేటర్లో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినా.. టెలివిజన్ రంగంలో మాత్రం ఇప్పటికీ కూడా మంచి ఆదరణ దక్కించుకుంటాయి. దీంతో మహేష్ అభిమానులు మళ్లీ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఎప్పుడు ఉంటుందో అనే విధంగా ఎప్పటినుండో ఆశక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.
ఇలాంటి తరుణంలో సినీ ఇండస్ట్రీలో ఓ వార్త ఇటీవల వైరల్ అవుతుంది. మేటర్ లోకి వెళ్తే త్రివిక్రమ్.. మహేష్ బాబు కి ఓ ప్రాజెక్టుకు సంబంధించి .. చిన్న లైన్ వినిపించినట్లు, త్వరలోనే పూర్తి స్టోరీ చెప్పడానికి రెడీ అవుతున్నట్లు, అంతా ఓకే అయితే అధికారిక ప్రకటన రానున్నట్లు ఫిలిం నగర్ టాక్. మరో పక్క మహేష్ తో రాజమౌళి చేయబోయే సినిమాకి సంబంధించిన స్టోరీ కూడా రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో మహేష్ అభిమానులకు పూనకాలు తెప్పించే ప్రాజెక్టులు రెడీ అవుతున్నట్లు సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.