SSMB 28: సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే 3 సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నారు. “సర్కారు వారి పాట” సినిమా విజయంతో మంచి జోష్ మీద ఉన్న మహేష్ ప్రస్తుతం ఫ్యామిలీతో యూరప్ ట్రిప్ లో ఉన్నారు. త్వరలో హైదరాబాద్ చేరుకొని నెక్స్ట్ త్రివిక్రమ్ తో “SSMB 28” షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా రెండు సినిమాలు రావడం తెలిసిందే. రెండూ కూడా ప్రేక్షకులను ఎంతగానే ఎంటర్టైన్ చేయడం జరిగింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీంతో వస్తున్న మూడో సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే మహేష్ బాబుతో చేయబోయే ఈ ప్రాజెక్ట్ లో సీనియర్ యాక్టర్ మోహన్ బాబుని.. అదేవిధంగా శోభననీ తీసుకోవడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంది. గతంలో త్రివిక్రమ్ తన సినిమాలలో సీనియర్ హీరోయిన్ లను తీసుకోవడం తెలిసిందే. టబు, స్నేహ, నదియా వంటి వారిని తీసుకున్నారు. అయితే మహేష్ బాబు సినిమా కోసం శోభననీ తీసుకోవడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి పార్ధు, లేదా అర్జునుడు అనే టైటిల్స్ పెట్టే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్టు సమాచారం. ఈ సినిమా దాదాపు ఆరు నెలలలో కంప్లీట్ చేసి వచ్చే ఏడాది ఉగాది పండుగ నాడు విడుదల చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. అంత మాత్రమే కాదు ఈ సినిమాలో మహేష్ డబల్ ఫోజ్ లో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో “SSMB 28” పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు ఇండస్ట్రీ టాక్.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!