Radhey Shyam: ఫస్ట్ టైం పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మరియు తిరుగులేని స్టార్ హీరోయిన్ పూజ నటించిన “రాధేశ్యాం” మార్చి 11న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో తెరకెక్కిన ఈ సినిమా కోసం సినీ ప్రేమికులు ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. బాహుబలి తో … దేశవిదేశాలలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ కావటంతో… ఈ సినిమా చూడటానికి ఇతర దేశస్తులు కూడా ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం.. సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అప్పట్లో పూజ హెగ్డేకి.. ప్రభాస్ మధ్య గొడవలు జరిగినట్లు ఇద్దరు మాట్లాడుకోవడం లేదన్నట్టు.. వార్తలు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. తాజా ప్రమోషన్ కార్యక్రమంలో అప్పటి గొడవలు గురించి వచ్చిన వార్తలు గురించి.. పూజా హెగ్డే నీ మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దానికి బుట్ట బొమ్మ.. సమాధానమిస్తూ..” హీరో ప్రభాస్ చాలా మంచి వ్యక్తి. అందరితో కలిసిపోయే నటుడు.
అటువంటి హీరోతో కలిసి నటించడం నా అదృష్టం. ప్రభాస్ తో కలిసి పని చేసిన రోజులన్నీ మర్చిపోలేనిది. మా ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం. షూటింగ్ జరుగుతున్న రోజులన్నీ నాకు అదే విధంగా మా ఇంటికి స్పెషల్ గా ఆహారాన్ని .. ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని ప్రభాస్ పంపేవాడు. ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్. ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్టు ఆధారాలు లేని వార్తలను దయచేసి ప్రచారం చేయకండి. అవన్నీ పుకార్లే అంటూ.. పూజా హెగ్డే క్లారిటీ ఇచ్చింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!