KGF 2: రాజమౌళి సినిమా వచ్చిన ప్రతీసారి మిగతా దర్శకులకు పెద్ద టెన్షన్ ఉంటోంది. ఆయన క్రేజ్ అందుకోవాలంటే ఏ దర్శకుడికైనా పెద్ద సవాల్గా మారుతోంది. ఇప్పటికే, మన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్తో పాటు బాలీవుడ్ అగ్ర దర్శకులు సౌత్ సినిమా ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్స్ కూడా రాజమౌళి ప్రతిభను పొగడ్తలతో ముంచేసిన సంగతి తెలిసిందే. ఆయన బాహుబలి సిరీస్ సినిమాల తర్వాత హాలీవుడ్ దర్శకుల లిస్ట్లో చేరాల్సినవాడని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఇక ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయన రేంజ్ మరో రేంజ్కు చేరుకుంది.
ఈ విషయమై దర్శకుడు ప్రశాంత్ నీల్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ ఛాప్టర్ 2 మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్తో హోంబలే సంస్థపై విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకుడు రాజమౌళిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
KGF 2: సీక్వెల్ సినిమా అని కాస్త కంగారు ఉందని అన్నారు.
కేజీఎఫ్ 2 రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అందరూ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ సినిమాలతో పోల్చి చూస్తుండటం కాస్త టెన్షన్గా ఉందని…రాజమౌళి రేంజ్లో నా మీద అందరూ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు. ఇక ప్రతీ సినిమా రిలీజ్ సమయంలో నెర్వెస్గా ఫీలవుతుంటానని అన్నారు. ఇక సీక్వెల్స్ అన్నీ బ్లాక్ బస్టర్ అయిన సందర్భాలు చాలా తక్కువ. కానీ, ఈ విషయంలో బాహుబలి సిరీస్ కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఇదే కేజీఎఫ్ సిరీస్ విషయంలో నిజమవుతుందని చెప్పుకొచ్చారు. అయినా ఎక్కడో సీక్వెల్ సినిమా అని కాస్త కంగారు ఉందని అన్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!