Pushpa: ఈ నెల 17న భారీ స్థాయిలో పాన్ ఇండియన్ సినిమాగా 5 భాషలలో విడుదలైన పుష్ప నిర్మాతల మీద వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో ఆర్య, ఆర్య 2 లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత హ్యాట్రిక్ సినిమాగా వచ్చింది పుష్ప: ది రైజ్ పార్ట్ 1. రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ముత్తం శెట్టి మీడియా వారితో కలిసి భారీ బడ్జెట్తో నిర్మించారు. ఈ సినిమా అల్లు అర్జున్కు తమిళ, కన్నడ, మలయాళ భాషలలో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే పుష్ప చిత్రాన్ని పాన్ ఇండియన్ సినిమాగా విడుదల చేశారు.
ఒక్క ఏపీలో ఈ సినిమాకు వసూళ్ళ పరంగా మైనస్ అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా వసుళ్ళు రాబడుతోంది. పుష్ప రిలీజ్ సోలో కాబట్టి అన్ని ప్రాంతాల నుంచి బాగా వసూళ్ళు రాబట్టింది. అఖండ సక్సెస్ ప్రభాస్ ఈ సినిమా ఏమాత్రం పడలేదని చెప్పాలి. ఇక పుష్ప రిలీజ్ అయిన వారం తర్వాత నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ వచ్చింది. ఈ సినిమా కూడా పాన్ ఇండియన్ సినిమాగానే 5 భాషలలో రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ, పుష్ప సినిమా ముందు శ్యామ్ సింగ రాయ్ నిలబడుతుందా అనుకున్నారు. కానీ, అలాంటి ప్రభావం ఏదీ లేకుండా మంచి వసూళ్ళు సాధిస్తోంది.
Pushpa: ఆర్ఆర్ఆర్ సినిమా మీద పుష్ప నిర్మాత సంచలన వ్యాఖ్యలు..
అయితే పుష్ప సినిమా సాధిస్తున్న వసూళ్ళకు మరో రెండు వారాలు ఏ సినిమా వచ్చి పోటీ ఇవ్వకపోతే 350 కోట్ల వరకు గ్రాస్ వసూళ్ళు రాబడుతుందని చిత్ర నిర్మాత అన్నారు. అది ఆర్ఆర్ఆర్ సినిమా గురించే. ఈ విషయాన్ని నిర్మాత అందరి ముందు ఓపెన్గా వెల్లడించారు. సంక్రాంతి వరకు గనక ఆర్ఆర్ఆర్ రిలీజ్ చేయకపోతే ఖచ్చితంగా మా సినిమానే 2021లో హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేస్తుందని నిర్మాత తెలిపారు. అయితే ఆయన ఇలా ఆర్ఆర్ఆర్ సినిమా మీద సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక కరోనా థర్డ్ వేవ్ ఒమిక్రాన్ కారణంగా సంక్రాంతికి రావాల్సిన రెండు సినిమాలు పోస్ట్పోన్ అయ్యే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!