స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా వైరస్ లాక్ డౌన్ తర్వాత కుటుంబంతో కలిసి అదిలాబాద్ అడవుల బాట పట్టారు. సుకుమార్ దర్శకత్వంలో నటించబోయే “పుష్ప” సినిమా లొకేషన్ల కోసం అల్లు అర్జున్ రెండు తెలుగు రాష్ట్రాలలో అడవి బాట పట్టడం జరిగింది. చాలా రోజుల తర్వాత బన్నీ బయటకు రావటంతో ఆ ప్రాంతంలో ప్రజలు బన్నీతో ఫోటోలు దిగటానికి ఎగబడ్డారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో రిలీజ్ కావడంతో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఇదే రీతిలో అల్లు అర్జున్ ఫాలో అవుతూ రాజమౌళి కర్ణాటక రాష్ట్రంలో ఓ టైగర్ రిజర్వ్ ఫారెస్టులో భార్య రమాదేవి తో రాజమౌళి ట్రిప్ వేశారట. గత చిత్రం “బాహుబలి”లో ఫారెస్ట్ సన్నివేశాలు ఉన్న సంగతి తెలిసిందే.
కాగా ప్రస్తుతం చేస్తున్న “RRR” లో కూడా ఫారెస్ట్ బ్యాక్డ్ డ్రాప్ లో సన్నివేశాలు ఉన్నాయట. అటు మన్నెం దొర, ఇటు కొమరంభీం రెండు క్యారెక్టర్లకు అడవులతో అనుబంధం ఉండటం తో…. పులుల గురించి మొత్తం తెలుసుకోవడానికి రాజమౌళి కర్ణాటక ఫారెస్ట్ అధికారులతో ట్రిప్ వేశారట. కానీ పులులు కనిపించకపోవటంతో ఏనుగులు మాత్రమే కనిపించడం తో జక్కన్న వెనుతిరిగి వచ్చేసారట.
టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కి వెళ్లక ముందు కర్ణాటక రాష్ట్రంలో కొన్ని దేవాలయాల్లో భార్య రమా తో కలిసి రాజమౌళి ప్రత్యేకమైన పూజలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రమా రాజమౌళి దేవాలయాల్లో చాలా ప్రశాంతంగా ఉందని సన్నిహితులతో అన్నారట. పరిస్థితి ఇలా ఉండగా అక్టోబర్ మాసం నుండి “RRR” సినిమా కి సంబంధించి షూటింగ్ మొదలుపెట్టే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసారి పక్కాగా సినిమా మొత్తం కంప్లీట్ చేయటానికి రాజమౌళి యాక్షన్ షెడ్యూల్ ప్లాన్ రెడీ చేసుకున్నట్లు టాక్. మొత్తంమీద కరోనా వైరస్ ఎఫెక్ట్ తో అల్లు అర్జున్, రాజమౌళి తమ సినిమాల షూటింగ్ల కోసం ఇప్పుడు అడవి బాట పట్టడం ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!