Vyooham: ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో “వ్యూహం” అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ ఇటీవల స్టార్ట్ అయ్యింది. వైయస్ జగన్ పాత్రలో అజ్మల్ అమీర్, వైయస్ భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటిస్తున్నారు. తాజాగా వైయస్ జగన్ మరియు వైయస్ భారతి దగ్గర పోలి ఉండే సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలను విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటిది “వ్యూహం”… రెండోది “శపథం” పేరుతో రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి స్టిల్స్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా విడుదల చేయడం జరిగింది.
అంతేగాని ఈ సినిమా బయోపిక్ కాదని రియల్ పిక్ అంటూ ఆర్జీవి గతంలోనే ప్రకటించారు. దీంతో తాజాగా విడుదలైన ఫోటోలు సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసాయి. ఇందులో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోపై చేతిని ఆణించి దీర్ఘ ఆలోచనలో ఆజ్మల్ కనిపిస్తున్నాడు. మానస లుక్ కూడా అచ్చం జగన్ భార్య భారతినీ తలపిస్తుంది. ఈ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో పొలిటికల్ కథంశంతో ఈ సినిమా రూపొందిస్తున్నట్లు ఆర్జీవి గతంలో తెలియజేయడం జరిగింది.
రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ జీవితంలో ఎదురైన పరిణామాలను…”వ్యూహం” సినిమాలో ఆర్జీవి చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఈ సినిమా రాబోతున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల సమయంలో విడుదలైన “యాత్ర” వైసీపీ పార్టీకి ఎంతో మైలేజ్ తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో 2024 ఎన్నికలకు ముందు..”వ్యూహం”, “శపథం” రెండు సినిమాలు జగన్ పొలిటికల్ ఇమేజ్ కి మరింత మైలేజ్ తీసుకొచ్చే రీతిలో ఆర్జీవి వర్క్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమా శరవేగంగా జరుపుకొని.. జులై 8వ తారీకు వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా..ఫస్ట్ గ్లింప్స్ వీడియో ఆర్జీవి రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!