Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నీ ఆయన తండ్రిని చంపేస్తామని బెదిరింపు లేఖ రాయటం తెలిసిందే. గ్యాంగ్ స్టార్ లారెన్స్ బీష్ణోయ్ అనుచరులు ముంబైలో సల్మాన్ ఇంటి చుట్టూ రెక్కీ కూడా నిర్వహించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. పంజాబ్ రాష్ట్రంలో సింగర్ సిద్ధూ మూసేవాలానీ చంపే రీతిలో… సల్మాన్ ఖాన్ నీ చంపేస్తామని దుండగులు లెటర్ రాసినట్లు వార్త రావడం కలకలం రేపుతోంది. దీంతో ఇప్పటికే సల్మాన్ ఖాన్ కుటుంబానికి ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు ముంబై పోలీస్ శాఖ ఏర్పాటు చేయడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పరిస్థితి ఇలా ఉంటే “కబీ ఈద్ కబీ దీవాలి” సినిమాకి సంబంధించి హైదరాబాద్ షెడ్యూల్ లో తాజాగా పాల్గొనటానికి సల్మాన్ ఖాన్ హైదరాబాద్ నగరానికి రావడం జరిగిందట. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ నేపథ్యంలో తాజా పరిస్థితుల తరుణంలో.. సల్మాన్ ఖాన్ షూటింగ్ అయ్యేంత వరకు దాదాపు నెల రోజుల పాటు రామోజీ ఫిలిం సిటీ చుట్టూ భద్రతా వలయం ముంబై పోలీస్ శాఖ ఏర్పాటు చేసినట్లు సమాచారం. హైదరాబాద్ లో జరగబోయే షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. అంత మాత్రమే కాదు ఈ సినిమాలో కీలక పాత్రలో విక్టరీ వెంకటేష్ కూడా నటించనున్నారు. సల్మాన్ అదేవిధంగా వెంకటేష్ లకి సంబంధించి సన్నివేశాలు ఈ షెడ్యూల్ లో షూట్ చేయనున్నట్లు సమాచారం.
ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి మెయిన్ హీరో గా నటిస్తున్న గాడ్ ఫాదర్ లో.. సల్మాన్ ఖాన్ కూడా కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి, సల్మాన్ కి సంబంధించిన సన్నివేశాలు గతంలోనే ముంబైలో షూట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు సల్మాన్ హైదరాబాద్ రావటంతో.. ఒక స్పెషల్ సాంగ్ షూట్ చేయబోతున్నారట. ప్రభుదేవా కొరియోగ్రఫీ ఆధ్వర్యంలో.. ఈ సాంగ్ షూటింగ్ జరుగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంమీద చంపేస్తామని లెటర్ రాయడం తో ఇప్పుడు సల్మాన్ హైదరాబాద్ లో ఎంట్రీ అవడంతో పూర్తి భద్రతా వలయంలో ఆయన చేయబోయే షూటింగ్ ప్రాంతాలు ఉండనున్నట్లు టాక్.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!