కరోనా వైరస్ వల్ల విధింపబడిన లాక్ డౌన్ లో ఒక సినిమా తెరకెక్కించిన ఘనత రామ్ గోపాల్ వర్మ కే చెందుతుంది. ఆయన నిజానికి ఒకటికి రెండు సినిమాలు తీయడం అనేది చాలా పెద్ద విషయం. ఆ చిత్రాలు జనాలకు నచాయా లేదా అన్న విషయం పక్కన పెడితే వాటికి తగ్గ పాపులారిటీ వాటికి వచ్చింది మరియు వర్మకు కోట్లాది రూపాయలు కుమ్మరించాయి. ఆయన తాజాగా తెరకెక్కించిన ‘నగ్నం’ చిత్రం బూతుకి పర్యాయపదంగా ఉందని చాలామంది అంటున్నారు. ఆ చిత్రంలో హీరోయిన్ గా నటించిన స్వీటీ పశ్చిమగోదావరి జిల్లా అమ్మాయి కావడం గమనార్హం.
అయితే స్వీటీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు బయట పెట్టింది. ఆమె ప్రొఫెషనల్ గా కాస్ట్యూమ్ డిజైనర్ అని మరియు దేశముదురు, చందమామ, యువత, నచ్చావులే వంటి చాలా సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్ కూడా చేశానని చెప్పింది. తాజాగా వలయం అనే సినిమాకి కూడా ఆమె ఫ్యాషన్ డిజైనర్ గా చేసిందట. ఆ సినిమాలోనే ఒక ఆర్టిస్ట్ సమయానికి రాకపోవడంతో ఆమె ఒక చిన్న పాత్ర చేయవలసి వచ్చిందట.
అయితే తనకు చిన్న చిన్న క్యారెక్టర్లు చేయడం ఇష్టం లేదు అని చెప్పిన స్వీటీ…. ముందుగా ‘ఫిదా’ సినిమా లో సాయి పల్లవి అక్క గా తనను చేయమని శేఖర్ కమ్ముల అడిగారని వెల్లడించింది. అయితే ఆమెకు చిన్న క్యారెక్టర్లు చేయడం ఇష్టం లేకపోవడంతో ఆ పాత్రను రిజెక్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇక వలయం సినిమా కోసం వారు బలవంతపెడితే ఒక పాత్ర చేశానని… ఆ సినిమాకి పనిచేసిన వెంకట్ నగ్నం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ కావడంతో ఆమెకు ఫుల్ లెంత్ హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందట. ఇక శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడి ఆఫర్ రిజెక్ట్ చేసి ఆర్జీవీ నగ్నం సినిమాలో నటించిన స్వీటీ కెరీర్ ఎలా ఉండబోతుందో….
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!