RRR: మార్చి 25 గురించి గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఆ తేదీ రానే వచ్చింది. మరికొన్ని గంటల్లో తేదీ మారబోతోంది. థియేటర్స్లోకి ఆర్ఆర్ఆర్ సినిమా రాబోతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్.టి.ఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. రాజమౌళి తండ్రి అగ్ర రచయిత కె వి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించారు.
ఇక ఈ సినిమా గురించి ఆయన గత ఏడాదే కొన్ని ఆసక్తికరమైన విషయాలను రివీల్ చేశారు. దాదాపు కథ మొత్తం పిక్షన్ అని చరణ్, తారక్ల మధ్య బాలీవుడ్ నటి ఆలియా భట్ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా అద్భుతంగా వచ్చిందని..సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి అందించిన సంగీతం మరో స్థాయిలో నిలుస్తుందని అన్నారు. ఇక గత వారం రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ నిర్వహించిన చరణ్, రాజమౌళి – తారక్ ఇంటికి చేరుకొని రిలాక్స్ అవుతున్నారు.
RRR: ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.
ఇప్పుడు అందరూ ఈ సినిమా యూఎస్ ప్రీమియర్స్ టాక్ గురించే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే, తాజాగా ఈ సినిమాను ఓ ప్రముఖ వ్యక్తి ఇప్పటికే 12 సార్లు చూశారట. ఆయనే ఆర్ఆర్ఆర్ చిత్రానికి వీఎఫెక్స్ అందించిన శ్రీనివాస మోహన్. అన్నీ ఫార్మాట్లలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని శ్రీనివాస మోహన్ 12 సార్లు చూశానని..చూసిన ప్రతీసారీ ఎంతో ఉత్కంఠతకు లోనయినట్టు ఇదే సినిమాను బిగ్ సిల్వర్ స్క్రీన్ మీద చూడాలని ఇంకా ఆతృతగా ఉన్నట్టు ఆయన తెలిపారు. చూసిన ప్రతీసారి మరోసారి చూడాలనే ఆసక్తి పెరుగుతుందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
@RRRMovie RRRepeat mode on. Watched 12 times on the big screen in every format, excitement is increasing with each viewing. Can't wait to see the audience reaction. 12 hours to go. #RRRFromTomorrow pic.twitter.com/oaNLC1MFDN
— Srinivas Mohan (@srinivas_mohan) March 24, 2022
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!