ఈ ఏడాది ఏప్రిల్ 14వ తారీకు “కేజిఎఫ్ 2” విడుదల కావడం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. పాన్ ఇండియా నేపథ్యంలో విడుదల అయి దేశవ్యాప్తంగా రికార్డు స్థాయి కలెక్షన్స్ కొల్లగొట్టింది. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో 400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించటం సంచలనం రేపింది. ఓవరాల్ గా చూసుకుంటే వెయ్యి కోట్లకు పైగానే “కేజిఎఫ్ 2” కలెక్షన్స్ రాబట్టడం జరిగింది. దీంతో ఇండియాలో అత్యధిక వసూలు చేసిన సినిమాల లిస్టులో టాప్ ఫైవ్ స్థానం దక్కించుకుంది.
అంతకుముందే “కేజిఎఫ్” విడుదల కావటం అది కూడా సూపర్ డూపర్ హిట్ కావటంతో రెండో పార్ట్ పై జనాలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఆడియన్స్ పెట్టుకున్నా అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. తనదైన శైలిలో “కేజిఎఫ్ 2″ చిత్రీకరించడం జరిగింది. హీరో యాష్ నీ చాలా వైలెంట్ గా చూపించడంతోపాటు… యాక్షన్ సన్నివేశాలను అద్భుత రీతిలో షూట్ చేయటంతో..”కేజిఎఫ్ 2” భాషలు మరియు ప్రాంతాలకు సంబంధం లేకుండా సినీ ప్రేమికులు ఆదరించారు. సినిమా మొత్తానికి హీరోయిజం ఎలివేషన్ చాలా హైలెట్ గా నిలిచింది. పైగా విలన్ పాత్రలో సంజయ్ దత్ వంటి హీరోని చాలా భయంకరంగా చూపించడంతో.. పాటు అదే రీతిలో చాలా పవర్ ఫుల్ పాత్రలో యాష్ నీ ప్రశాంత్ నీల్ చూపించి “కేజిఎఫ్ 2” తో అనేక ఇండస్ట్రీలలో సంచలనలు సృష్టించారు.
కాగా సినిమా థియేటర్ లో విడుదలయ్యి ఇటీవల వంద రోజులు కావటంతో సినిమా యూనిట్ తాజాగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ గా మారింది. పరిస్థితి ఇలా ఉంటే “కేజిఎఫ్ 3″ కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు. రెండో భాగం క్లైమాక్స్ లో మూడో చాప్టర్ ఉన్నట్లు తెలపడంతో..”కేజిఎఫ్ 3” అధికారక వార్త కోసం సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!