Radhey Shyam: ప్రభాస్ నటించిన చివరి సినిమా “సాహో” 2019 వ సంవత్సరం ఆగస్టు నెలలో రిలీజ్ అయింది. దాదాపు రెండున్నర సంవత్సరాల వరకు ప్రభాస్ మూవీ ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. బాహుబలి లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత దాదాపు ఏడాదిన్నర పైగానే “సాహో” సినిమా షూటింగ్ జరుపుకోవడంతో అది ఫస్ట్ షోకే ప్లాప్ కావటంతో.. అభిమానులు ఫుల్ నిరుత్సాహ పడ్డారు. అయితే ఇంతలో “రాధేష్యం” షూటింగ్ ఆలస్యం చేయడం తో.. ప్రభాస్ సినిమాలు స్లోగా చేస్తారు.. అనే అపవాదు పడింది. ఈ తరుణంలో ప్రస్తుతం లైన్లో వరుస పెట్టి నాలుగు సినిమాలకి ఓకే చెప్పటం.
ఇదిలా ఉంటే ప్రభాస్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా గా.. “రాధేశ్యం” తెరకెక్కడం తెలిసిందే. కృష్ణంరాజు సొంత బ్యానర్ గోపికృష్ణ మూవీస్ మరియు యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థలపై తెరకెక్కిన ఈ చిత్రం.. మరికొద్ది గంటల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం.. “రాదే శ్యాం” సినిమా కి బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు సమాచారం. విషయంలోకి వెళితే 5షో కూడా వేసుకోవచ్చని.. పర్మిషన్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జీవో ఆదేశాల మేరకు సినిమా టికెట్ రేట్లు ఉండనున్నట్లు టాక్. ప్రేమకథా నేపథ్యంలో సినిమా తెరకెక్కిన క్రమంలో.. ప్రభాస్ చాలా డిఫరెంట్ పాత్రలో కనిపిస్తూ ఉండటంతో సినిమా చూడటానికి ప్రేక్షకులు మంచి ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. “బాహుబలి” తో ప్రపంచ స్థాయిలో తనకంటూ గుర్తింపు దక్కించుకోవడంతో.. ఇతర దేశాల్లో కూడా రాధేశ్యాం సినిమా కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. వెస్ట్రన్ లవ్ స్టోరీ తరహా ఫ్లేవర్ కలిగిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా ఫస్ట్ టైం నటించటం విశేషం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!