తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను అలరిస్తున్న షో బిగ్ బాస్. మూడు సీజన్లు ప్రేక్షకులను ఎంతగా అలరించాయో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం నాలుగో సీజన్ టెలికాస్ట్ అవుతుంది. ఎప్పుడో ప్రారంభం కావాల్సిన నాలుగో సీజన్ కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ ఇటీవల సెప్టెంబర్ మొదటి వారంలో స్టార్ట్ అవటం జరిగింది. ఇదిలా ఉండగా బిగ్ బాస్ సీజన్ వన్ విన్నర్ శివ బాలాజీ హౌస్ లో అప్పట్లో చాలా బ్యాలెన్సింగ్ ఆట ఆడుతూ ప్రేక్షకులను అలరించి విన్నర్ గా నిలవటం అందరికీ తెలిసిందే.
అటువంటి శివ బాలాజీ తాజాగా పిల్లల తల్లిదండ్రులను స్కూలు ఫీజులు అంటూ తెగ ఇబ్బందులకు గురి చేస్తున్న స్కూల్ యాజమాన్యాలపై పోరాటానికి దిగాడు. హైదరాబాద్ నగరం మణికొండలో “మౌంట్ లిటేరా జీ” స్కూల్ తీరుపై శివ బాలాజీ ఫైర్ అవుతూ ఏకంగా HRC ని ఆశ్రయించాడు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వ ఆదేశాలను ఈ స్కూల్ యాజమాన్యాలు బేఖాతరు చేస్తోందని ఆరోపించారు.
పేరెంట్స్ దగ్గర ఫీజులు వసూలు చేయడానికి అనవసర పరీక్షలు నిర్వహిస్తుందని, ప్రశ్నిస్తుంటే బెదిరింపులకు పాల్పడుతున్నారని, పిల్లలకు ఆన్లైన్ క్లాసులు చెప్పకుండా ఐడి బ్లాక్ చేస్తున్నారని అడిగితే తమపై కేసులు పెడతామని స్కూల్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నట్లు శివబాలాజీ తెలిపారు. దీంతో శివ బాలాజీ చేసిన కామెంట్లకు పబ్లిక్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. కరోనా వైరస్ కారణంగా ఉద్యోగాలు లేక చేతిలో డబ్బులు లేక ఉంటే… నిజంగా స్కూల్ యాజమాన్యాలు టార్చర్ పెడుతున్నాయని చాలామంది పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రుల ఆవేదన నిజంగా శివబాలాజీ తెలుసుకున్నాడు, శివ బాలాజీ నిజమైన బిగ్ బాస్ విన్నర్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!