అమ్మవారి అనుగ్రహానికి అనేక పూజాపద్ధతులను ఆయా శాస్త్రాలలో, పురాణాలలో పేర్కొన్నారు. వాటిలో సులభమైన పరిహారం అమ్మవారికి ఆయా రోజుల్లో ఆయా పదార్థాలను నివేదన చేయడం. దీనిగురించి తెలుసుకుందాం…
సోమవారం- పాయసం, మంగళవారం అరటిపండ్లు, బుధవారం వెన్న, గురువారం పటికబెల్లం, శుక్రవారం తీయని పాయసం, రవ్వకేసరి బెల్లం పాయసం వంటివి, శనివారం ఆవునెయ్యి, ఆదివారం పాలను నైవేద్యంగా పెడితే శ్రీఘ్రంగా అనుగ్రహిస్తుందని పండితులు పేర్కొంటున్నారు. భక్తితో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి శుభఫలితాలను పొందడమే కాకుండా సకలసంపదలను పొందండి.