కేరళలోని శబరిమలలో వెలసిన శ్రీఅయ్యప్ప దేవాలయంలో ఈ నెల 16 నుంచి నెలవారీ పూజలు ప్రారంభమం కానున్నాయి.
అక్టోబర్ 16 నుంచి ఐదు రోజులపాటు జరిగే ఈ పూజలకు భక్తులను అనుమతిస్తారు. శబరిమల అయ్యప్ప దేవస్థానాన్ని నడుపుతున్న ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 16న దేవస్థానాన్ని తెరుస్తారు. బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తామని బోర్డు ప్రకటించింది. గరిష్ఠంగా రోజుకు 250 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉంది. భక్తులు పంబకు చేరుకోవడానికి 48 గంటల ముందు పొందిన కోవిడ్-19 నెగెటివ్ ధ్రువపత్రాలను తమ వెంట తీసుకురావలసి ఉంటుందని తెలిపింది.