తిరుమలలో అధిక ఆశ్వీయుజమాసం సందర్భంగా నిర్వహిస్తున్న సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు ఉదయం ఉభయదేవేరులతో కల్పవృక్ష వాహనంపై స్వామి విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
క్షీరసాగరమథనంలో ఉద్భవించిన విలువైన వాటిలో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. కల్పవృక్షం మాత్రం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిం లభిస్తుందని పురాణ ప్రతీతి.