Nidhhi Agerwal: నిధి అగర్వాల్.. హైదరాబాదులోని హిందీ మాట్లాడే మార్వాడి కుటుంబంలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ బెంగళూరులో పెరిగింది. బిజినెస్ మేనేజ్మెంట్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నిధి.. సినిమాలపై ఉన్న ఆసక్తితో స్టడీస్ అనంతరం యాక్టింగ్ మరియు డాన్స్ నేర్చుకుంది. ఆపై మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. 2017లో మున్నా మైఖేల్ అనే హిందీ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది. 2017లో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాచి మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది.
ఆ వెంటనే అఖిల్ కు జోడీగా మిస్టర్ మజ్ను మూవీలో మెరిసింది. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ నిధి అగర్వాల్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కింది. రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఇస్మార్ట్ శంకర్ తో నిధి దశ తిరిగినట్టే అని అంతా అనుకున్నా.. అలా ఏమీ జరగలేదు.
ఇస్మార్ట్ శంకర్ తర్వాత తెలుగులో హీరో, తమిళంలో ఈశ్వరన్, భూమి, కలగ తలైవన్ వంటి చిత్రాల్లో నటించింది. ఇవేమి ఆమె కెరీర్ కు హెల్ప్ అవ్వలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడీగా హరి హర వీర మల్లు చిత్రంలో నిధి హీరోయిన్ గా ఎంపిక అయింది. అయితే ఈ సినిమా పట్టాలెక్కి మూడేళ్లు అవుతున్నా విడుదలకు మాత్రం నోచుకోలేదు. డైరెక్టర్ క్రిష్ ఈ మూవీని పక్కన పెట్టి రీసెంట్ గా అనుష్కతో ఓ కొత్త ప్రాజెక్ట్ ను కూడా అనౌన్స్ చేశాడు.
ప్రస్తుతం నిధి చేతిలో సినిమాలేమి లేవు. ఆకట్టుకునే అందం, అంతకు మించిన నటనా ప్రతిభ ఉన్నప్పటికీ.. నిధి అగర్వాల్ కు సినిమా అవకాశాలు మాత్రం అందనంత ఎత్తులోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఛాన్సుల కోసం నిధి సోషల్ మీడియా ద్వారా అందాల ఆరబోతకు తెర లేపింది. ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫోటోషూట్లతో కుర్రకారును కవ్విస్తోంది. తాజాగా కూడా చీరలో వయ్యారాలు ఒలకబోస్తూ నెట్టింట హీట్ పుట్టించింది. మత్తెక్కించే కళ్లు, ఎద సోయగాలతో మతిపోగొట్టుంది. నిధి లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.